Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో జీఆర్ఏపీ-3 ఆంక్షలు అమలు.. ప్రైమరీ స్కూల్స్ మూసివేత

ఠాగూర్
శుక్రవారం, 15 నవంబరు 2024 (09:58 IST)
ఢిల్లీలో జీఆర్ఏపీ-3 ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఢిల్లీ ఎన్.సి.ఆర్‌లో వాయుకాలుష్యం భారీగా పెరిగిపోయింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో స్టేజ్-3 ఆంక్షలు అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ కారణంగా ఐదో తరగతి వరకు అన్ని ప్రాథమిక పాఠశాలలను మూసివేయాల్సిందిగా ఆదేశించింది. ఈ పాఠశాలలకు సంబంధించి ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ ఆదేశించారు. ఈ ఆదేశాలు తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు అమలు చేస్తున్నారు. 
 
స్టేజ్-3 ఆంక్షల ప్రకారం అత్యవసరం కాని నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం ఉంటుంది. ఐదో తరగతి వరకు విద్యార్థులకు సెలవులు ఇస్తారు. ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకరస్థాయికి పెరుగుతోంది. రెండు రోజులుగా వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) దాదాపు 400 దాటుతోంది. వాయు కాలుష్యం కట్టడి చర్యల్లో భాగంగా ఢిల్లీ - ఎన్సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-3ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments