Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తులో 15 మందిని తొక్కుకుంటూ వెళ్లిపోయిన కారు డ్రైవర్!!

ఠాగూర్
గురువారం, 14 మార్చి 2024 (13:23 IST)
ఢిల్లీలో ఓ దారుణ ఘటన జరిగింది. మద్యం మత్తులో ఓ కారు డ్రైవర్ ఏకంగా 15 మందిని ఢీకొట్టి, వారిని తొక్కుకుంటూ కారును నడిపాడు. ఈఘటనలో ఓ యువతి ప్రాణాలు కోల్పోగా, మిగిలినవారు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన ఈస్ట్ ఢిల్లీలోని ఘాజీపూర్‌లో బుధవారం రాత్రి జరిగింది. ఈ ఘటనకు కారణమైన కారు డ్రైవర్‌ను పట్టుకున్న స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన మహిళను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌కు చెందిన 22 యేళ్ల సీతాదేవిగా గుర్తించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ట్యాక్సీ డ్రైవర్ మయూర్ విహార్ ఫేజ్ 3కి వెళుతుండగా, ఈ ఘటన జరిగింది. 
 
పీకల వరకు మద్యం సేవించిన ట్యాక్సీ డ్రైవర్ బుదవారం రాత్రి 9.30 గంటల సమయంలో రద్దీగా ఉన్న బుద్ధ్ బజార్ ప్రాంతంలోని జనాన్ని తొక్కించుకుంటూ పోయాడు. కారు ఒక్కసారిగా అదుపుతప్పి జనంపైకి దూసుకెళ్ళడంతో అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు డ్రైవర్‌ను పట్టుకుని చితకబాదారు. కారును ధ్వంసం చేశారు.
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు... వెంటనే ఘటనా స్థలానికి చేరుకునేందుకు ప్రయత్నించగా, స్థానికులు వారిని ఘెరావ్ చేశారు. అయితే, పోలీసులు లాఠీలకు పని చెప్పి వారిని చెదరగొట్టి, నిందితుడుని తమ అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments