Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తులో 15 మందిని తొక్కుకుంటూ వెళ్లిపోయిన కారు డ్రైవర్!!

ఠాగూర్
గురువారం, 14 మార్చి 2024 (13:23 IST)
ఢిల్లీలో ఓ దారుణ ఘటన జరిగింది. మద్యం మత్తులో ఓ కారు డ్రైవర్ ఏకంగా 15 మందిని ఢీకొట్టి, వారిని తొక్కుకుంటూ కారును నడిపాడు. ఈఘటనలో ఓ యువతి ప్రాణాలు కోల్పోగా, మిగిలినవారు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన ఈస్ట్ ఢిల్లీలోని ఘాజీపూర్‌లో బుధవారం రాత్రి జరిగింది. ఈ ఘటనకు కారణమైన కారు డ్రైవర్‌ను పట్టుకున్న స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన మహిళను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌కు చెందిన 22 యేళ్ల సీతాదేవిగా గుర్తించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ట్యాక్సీ డ్రైవర్ మయూర్ విహార్ ఫేజ్ 3కి వెళుతుండగా, ఈ ఘటన జరిగింది. 
 
పీకల వరకు మద్యం సేవించిన ట్యాక్సీ డ్రైవర్ బుదవారం రాత్రి 9.30 గంటల సమయంలో రద్దీగా ఉన్న బుద్ధ్ బజార్ ప్రాంతంలోని జనాన్ని తొక్కించుకుంటూ పోయాడు. కారు ఒక్కసారిగా అదుపుతప్పి జనంపైకి దూసుకెళ్ళడంతో అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు డ్రైవర్‌ను పట్టుకుని చితకబాదారు. కారును ధ్వంసం చేశారు.
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు... వెంటనే ఘటనా స్థలానికి చేరుకునేందుకు ప్రయత్నించగా, స్థానికులు వారిని ఘెరావ్ చేశారు. అయితే, పోలీసులు లాఠీలకు పని చెప్పి వారిని చెదరగొట్టి, నిందితుడుని తమ అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

మనమే చిత్రం తల్లితండ్రులకు డెడికేట్ - శతమానం భవతి కంటే డబుల్ హిట్ : శర్వానంద్

సినిమాల్లో మన చరిత్ర, సంస్క్రుతిని కాపాడండి : అభిజిత్ గోకలే

సీరియల్ నటి రిధిమాతో శుభ్ మన్ గిల్ వివాహం.. ఎప్పుడు?

ఆడియెన్స్ కోరుకుంటున్న సరికొత్త కంటెంట్ మా సత్యభామ లో ఉంది : దర్శకుడు సుమన్ చిక్కాల

స్వయంభూ లో సవ్యసాచిలా రెండు కత్తులతో యుద్ధం చేస్తున్న నిఖిల్

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

ప్రోస్టేట్ కోసం ఆర్జీ హాస్పిటల్స్ పయనీర్స్ నానో స్లిమ్ లేజర్ సర్జరీ

జెన్ జెడ్ ఫ్యాషన్-టెక్ బ్రాండ్ న్యూమీ: హైదరాబాద్‌లోని శరత్ సిటీ మాల్‌లో అతిపెద్ద రిటైల్ స్టోర్‌ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments