Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్వరంతో బాధపడుతున్న విద్యార్థినిపై సీనియర్ల గ్యాంగ్ రేప్...

జ్వరంతో బాధపడుతున్న ఓ జూనియర్ విద్యార్థినిపై సీనియర్ విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం డెహ్రాడూన్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

Webdunia
మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (13:54 IST)
జ్వరంతో బాధపడుతున్న ఓ జూనియర్ విద్యార్థినిపై సీనియర్ విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం డెహ్రాడూన్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
డెహ్రాడూన్‌లోని ఓ బోర్డింగ్ పాఠశాలలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు చదువుకుంటున్నారు. వీరిలో ఒకరు పదో తరగతి చదువుతున్నారు. అయితే పదో తరగతి బాలికకు నెల రోజుల క్రితం జ్వరం వచ్చింది. దీంతో ఆ బాలికను చూసేందుకు కొంతమంది సీనియర్ విద్యార్థులు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన సీనియర్ విద్యార్థులు.. ఆ బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. 
 
ఈ విషయాన్ని ఆ బాధిత బాలిక రహస్యంగా ఉంచింది. అయితే ఆ బాలిక గర్భందాల్చినట్టు తాజాగా తేలింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాధితురాలి సోదరి, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా పాఠశాలకు చెందిన ఐదుగురు టీచర్లు, నలుగురు సీనియర్లను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం