Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరెరె.. పెన్షన్ల కోసం భర్తలను చంపేస్తున్నారట.. ఎక్కడ?

Webdunia
శనివారం, 17 నవంబరు 2018 (18:08 IST)
అవును.. పెన్షన్ల కోసం ఉత్తరప్రదేశ్‌లో మహిళలు భర్తలను చంపేస్తున్నారట. ఎలాగంటే..? యూపీలో భర్త ప్రాణాలతో వుండగానే కొందరు మహిళలు వితంతువులకు ఇచ్చే పెన్షన్ తీసుకుంటున్నారు. భర్తలను కోల్పోయిన వితంతువులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో భర్త ప్రాణాలతో వున్నప్పటికీ.. ఆయన మరణించినట్లు చెప్పి.. పెన్షన్లు తీసుకునే మహిళల సంఖ్య పెరిగిపోయిందని తేలింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్, సీతాపూర్ జిల్లాకు చెందిన సందీప్ కుమార్ సతీమణి సెల్‌ఫోన్‌కు.. ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్‌లో ఆమె అకౌంట్‌కు మూడు వేల రూపాయలు జమచేసినట్లు వుంది. ఈ మూడు వేలు ఎలా వచ్చిందని ఆరా తీసిన సందీప్ కుమార్.. దీనిపై బ్యాంకు అధికారులను అడిగి తెలుసుకున్నాడు. ఇది వితంతువులకు ఇచ్చే పెన్షన్ డబ్బు అని వారు వివరణ ఇవ్వడంతో షాక్ తిన్నాడు.
 
భర్త తాను ప్రాణాలతో వుండగా వితంతు పెన్షన్ ఎలా వచ్చిందని భార్యను నిలదీశాడు. తర్వాతే తెలిసింది.. సందీప్ భార్యే కాకుండా.. ఆ గ్రామానికి చెందిన 22 మంది మహిళలు.. భర్తలు బతికి వున్నప్పటికీ.. చనిపోయాడని నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి.. పెన్షన్ తీసుకున్నట్లు తేలింది. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments