Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పలు తెప్పలుగా మృతి చెందిన గబ్బిలాలు.. కరోనా అని జడుసుకున్న?

Webdunia
బుధవారం, 27 మే 2020 (11:30 IST)
Bats
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కుక్కలు, కాకులు, గబ్బిలాలు చనిపోవటం కరోనా వల్లనే అనే భయాందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా, యూపీలో మరోసారి గబ్బిలాలు గుంపు గుంపుగా చనిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఘోరఖ్ పూర్ సమీపంలో కుప్పలు తెప్పలుగా గబ్బిలాలు చచ్చిపడి ఉన్నాయి. 
 
అసలే కరోనా వైరస్ గబ్బిలాల నుంచే వచ్చిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఘోరఖ్‌పూర్ బేల్‌ఘాట్ గ్రామంలో పెద్ద సంఖ్యలో గబ్బిలాలు చచ్చి పడి ఉండటాన్ని చూసిన స్థానికులు ఇది కరోనా వల్లనే జరిగిందని చెప్పుకుంటున్నారు. 
 
ఈ సమాచారం వెటర్నరీ డాక్టర్లకు తెలియటంతో వారు ఘటనాస్థలానికి చేరుకుని వాటిని పరిశీలించారు. గబ్బిలాలు చనిపోవటానికి కరోనా వైరస్ కారణం కాదనీ ఈ ప్రాంతంలో ఎండలు బాగా ఉండటం వల్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావటంతోనే గబ్బిలాలు మరణించాయని తెలిపారు.  
 
అటవీ రేంజర్ మాట్లాడుతూ..ఉష్ణోగ్రత పెరగడం..గబ్బిలాలు చనిపోయిన ప్రాంతంలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని దీంతో గబ్బిలాలు చనిపోయాయని స్థానికులు ఏమాత్రం భయపడాల్సిన పనిలేదని సూచించారు. మరణించిన గబ్బిలాలను తదుపరి టెస్టు కోసం ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments