Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముక్కులో చుక్కల రూపంలో కరోనా బూస్టర్ డోస్ : డీసీజీఐ అనుమతి

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (18:57 IST)
భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో భారత్ బయోటెక్ తయారు చేసిన ఇంట్రా నాసల్ కోవిడ్ బూస్టర్ డోసేజ్ అధ్యయనాలకు పచ్చజెండా ఊపింది. దేశవ్యాప్తంగా తొమ్మిది వేర్వేరు ప్రదేశాల్లో చుక్కల రూపంలో కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌ పరీక్షలు చేపట్టనున్నారు. 
 
భారత్ బయోటెక్ ఇటీవల ఓమిక్రాన్ డిఫ్యూజన్ వ్యాక్సిన్‌ను బూస్టర్ డోస్‌గా అందించడానికి, క్లినికల్ అధ్యయనాలు చేయడానికి డీసీజీఐ నుంచి అనుమతిని అభ్యర్థించింది. 
 
భారత్ బయోటెక్ పొందిన సమాచారం ప్రకారం, సుమారు 5,000 మంది వాలంటీర్లపై ఈ క్లినికల్ అధ్యయనాలను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 
 
వారిలో సగం మంది కోవాక్సిన్ తీసుకునివున్నారు. మిగిలిన సగం మంది కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ వేయించుకున్నవారు ఉన్నారు. రెండో మోతాదు తీసుకుని 6 నుండి 9 నెలల సమయం పూర్తయిన వారిపై ఈ చుక్కల మందు బూస్టర్ డోస్ ప్రయోగాలను నిర్వహించనున్నారు. ఈ ప్రయోగాల తర్వాత ఫలితాలను మళ్లీ డీసీజీఐ ముందు ఉంచుతారు.  ఆతర్వాత ఈ చుక్కల మందుకు అత్యవసర అనుమతి లభించే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments