Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముక్కులో చుక్కల రూపంలో కరోనా బూస్టర్ డోస్ : డీసీజీఐ అనుమతి

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (18:57 IST)
భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో భారత్ బయోటెక్ తయారు చేసిన ఇంట్రా నాసల్ కోవిడ్ బూస్టర్ డోసేజ్ అధ్యయనాలకు పచ్చజెండా ఊపింది. దేశవ్యాప్తంగా తొమ్మిది వేర్వేరు ప్రదేశాల్లో చుక్కల రూపంలో కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌ పరీక్షలు చేపట్టనున్నారు. 
 
భారత్ బయోటెక్ ఇటీవల ఓమిక్రాన్ డిఫ్యూజన్ వ్యాక్సిన్‌ను బూస్టర్ డోస్‌గా అందించడానికి, క్లినికల్ అధ్యయనాలు చేయడానికి డీసీజీఐ నుంచి అనుమతిని అభ్యర్థించింది. 
 
భారత్ బయోటెక్ పొందిన సమాచారం ప్రకారం, సుమారు 5,000 మంది వాలంటీర్లపై ఈ క్లినికల్ అధ్యయనాలను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 
 
వారిలో సగం మంది కోవాక్సిన్ తీసుకునివున్నారు. మిగిలిన సగం మంది కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ వేయించుకున్నవారు ఉన్నారు. రెండో మోతాదు తీసుకుని 6 నుండి 9 నెలల సమయం పూర్తయిన వారిపై ఈ చుక్కల మందు బూస్టర్ డోస్ ప్రయోగాలను నిర్వహించనున్నారు. ఈ ప్రయోగాల తర్వాత ఫలితాలను మళ్లీ డీసీజీఐ ముందు ఉంచుతారు.  ఆతర్వాత ఈ చుక్కల మందుకు అత్యవసర అనుమతి లభించే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments