Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించిన యువకుడితో పెళ్ళి చేయలేదని.. నిద్రిస్తున్న తల్లిని చంపేసిన కుమార్తె

Webdunia
గురువారం, 6 ఫిబ్రవరి 2020 (14:35 IST)
కన్నతల్లి అనే కనీస కనికరం కూడా లేకుండా, తనకు అడ్డు తగులుతుందన్న ఆగ్రహంతో ఒక యువతి, అతి క్రూరంగా తన తల్లిని హత్య చేసింది. కర్ణాటకలో కలకలం రేపిన ఈ ఘటన బెంగళూరు కేఆర్ పురంలోని అక్షయనగర్ పరిధిలో జరిగింది. 
 
ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన నిర్మల తన కుమారుడు, కుమార్తె అమృతలతో కలిసి అక్షయ నగర్‌లో నివాసం ఉంటోంది. తన తల్లితో నిత్యం గొడవలు పడుతూ ఉండే అమృత, నిన్న జరిగిన వాగ్వాదంతో తీవ్ర ఆగ్రహానికి గురైంది. దీంతో నిర్మల తన గదిలోకి వెళ్లి నిద్రపోగా, అప్పటికే కోపంతో ఉన్న అమృత, కత్తిని తీసుకుని వెళ్లి, తల్లిని దారుణంగా పొడిచి, హత్య చేసి పరారైంది. 
 
దీన్ని చూసిన కుమారుడు కూడా పరారయ్యాడు. స్థానికుల ద్వారా విషయం తెలసుకున్న కేఆర్ పురం పోలీసులు, ఘటనా స్థలిని సందర్శించి కేసు నమోదు చేసి, అమృత కోసం గాలిస్తున్నారు. తాను ప్రేమించిన ప్రియుడితో పెళ్లి చేయమని తరచూ తల్లితో అమృత గొడవపడటం అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతోనే హత్య చేసి పరారైనట్లు పోలీసులు విచారణలో తేలింది. నిందితురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments