Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించిన యువకుడితో పెళ్ళి చేయలేదని.. నిద్రిస్తున్న తల్లిని చంపేసిన కుమార్తె

Webdunia
గురువారం, 6 ఫిబ్రవరి 2020 (14:35 IST)
కన్నతల్లి అనే కనీస కనికరం కూడా లేకుండా, తనకు అడ్డు తగులుతుందన్న ఆగ్రహంతో ఒక యువతి, అతి క్రూరంగా తన తల్లిని హత్య చేసింది. కర్ణాటకలో కలకలం రేపిన ఈ ఘటన బెంగళూరు కేఆర్ పురంలోని అక్షయనగర్ పరిధిలో జరిగింది. 
 
ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన నిర్మల తన కుమారుడు, కుమార్తె అమృతలతో కలిసి అక్షయ నగర్‌లో నివాసం ఉంటోంది. తన తల్లితో నిత్యం గొడవలు పడుతూ ఉండే అమృత, నిన్న జరిగిన వాగ్వాదంతో తీవ్ర ఆగ్రహానికి గురైంది. దీంతో నిర్మల తన గదిలోకి వెళ్లి నిద్రపోగా, అప్పటికే కోపంతో ఉన్న అమృత, కత్తిని తీసుకుని వెళ్లి, తల్లిని దారుణంగా పొడిచి, హత్య చేసి పరారైంది. 
 
దీన్ని చూసిన కుమారుడు కూడా పరారయ్యాడు. స్థానికుల ద్వారా విషయం తెలసుకున్న కేఆర్ పురం పోలీసులు, ఘటనా స్థలిని సందర్శించి కేసు నమోదు చేసి, అమృత కోసం గాలిస్తున్నారు. తాను ప్రేమించిన ప్రియుడితో పెళ్లి చేయమని తరచూ తల్లితో అమృత గొడవపడటం అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతోనే హత్య చేసి పరారైనట్లు పోలీసులు విచారణలో తేలింది. నిందితురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments