Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో తల్లి రాసలీలలు, చూసిన కుమార్తె తండ్రితో చెప్పడంతో..

Webdunia
బుధవారం, 10 జూన్ 2020 (17:29 IST)
భర్త డ్యూటీకి వెళ్లినప్పుడు రహస్యంగా ప్రియుడిని ఇంటికి రప్పించుకుని రాసలీలలు సాగిస్తున్న మహిళ అసభ్యకర రీతిలో కూతురి కంటపడింది. చివరికి భర్త చేతిలో హతమైంది. వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణాన్ని బలితీసుకున్న ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
 
వేలూరు సమీపంలోని కమ్మవాన్‌పేటకు చెందిన సెల్వం అనే వ్యక్తికి చిత్రతో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు, చిత్ర అదే గ్రామానికి చెందిన మరో యువకునితో కొంతకాలంగా వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త డ్యూటీకి వెళ్లినప్పుడు ఇంటికి రప్పించి రాసలీలలు సాగించేది. ఈ విషయంపై పలుమార్లు భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అయినా ప్రవర్తన మార్చుకోని చిత్ర ఆదివారం కూడా భర్త, కూతురు బయటకు వెళ్లినప్పుడు ప్రియుడిని రప్పించుకుంది. 
 
పనిమీద బయటకు వెళ్లిన కూతురు తిరిగి ఇంటికి రాగా చిత్ర అసభ్యకర రీతిలో కనిపించింది. తల్లీ కూతుళ్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సెల్వం డ్యూటీ ముగించుకుని రాత్రి 12 గంటలకు ఇంటికి రాగా కూతురు విషయం మొత్తం తండ్రికి చెప్పింది. దంపతుల మధ్య పెద్ద గొడవ జరిగింది. సెల్వం పెద్ద కర్ర తీసుకుని భార్య తలపై గట్టిగా కొట్టడంతో రక్తం కారుతూ ఆమె క్రింద పడిపోయింది. చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకువెళ్లే ప్రయత్నం చేయగా ఇంటివద్దే ఆమె మృతి చెందింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments