Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోన్ దాచిపెట్టాడనీ... కన్న తండ్రిని కొట్టి చంపిన కుమార్తె... ఎక్కడ?

Webdunia
బుధవారం, 27 జనవరి 2021 (07:57 IST)
మొబైల్ ఫోన్‌కే అంకితమైన కుమార్తెను తిరిగి దారికి తెచ్చే క్రమంలో కుమార్తె చేతిలో తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. మొబైల్ ఫోన్ దాచిపెట్టాడన్న కోపంతో కన్నతండ్రిని కుమార్తె కొట్టి చంపేసింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌ జిల్లాలో జరిగింది.
 
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బిలాస్‌పూర్ జిల్లాలోని కాంచన్​పూర్​ గ్రామానికి చెందిన మాంగ్లు రామ్​ధనుకర్​ (58) అనే వ్యక్తికి దివ్య సరస్వతి అనే కుమార్తె ఉంది. ఈమెకు వివాహమైంది. ఇటీవలే ఆమె భర్త తల్లిదండ్రుల దగ్గరకి పంపించాడు. 
 
పుట్టింటికి వచ్చిన సరస్వతి... తన సెల్​ఫోన్​ కనిపించడం లేదని తండ్రి మాంగ్లును అడిగింది. తనేమన్న తీస్తే ఇవ్వమంది. తను సెల్​ఫోన్​ తీయలేదని మాంగ్లు సమాధానమిచ్చాడు.
 
అనుమానమొచ్చి కాస్త గట్టిగా అడిగింది సరస్వతి. దాంతో అతను నిజం చెప్పాడు. తన ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లిచేసుకున్నందుకే ఫోన్​ దాచినట్లు తెలిపాడు. 
 
ఎంతకీ ఫోన్ ఇవ్వకపోవడం వల్ల కర్రతో కొట్టి, రాయితో బాది తండ్రిని హతమార్చిందని పోలీసులు తెలిపారు. శవాన్ని ఇంటి ఆవరణలో పూడ్చిపెట్టిందని, అందుకు ఆమె తల్లి సహకరించిందని పేర్కొన్నారు.
 
పక్కింటివారు ఈ ఘటనను చూసి తమకు సమాచరమిచ్చారని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరిని అరెస్టు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments