Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేటానే ఆధునిక యుగపు కొత్త వనరు: ముఖేష్ అంబానీ

నాలుగో పారిశ్రామిక విప్లవం యొక్క పునాది కనెక్టివిటీ మరియు డేటాయేనని, భౌతిక, డిజిటల్, జీవపరమైన అన్ని శాస్త్రాల సమ్మేళనం ఫలితంగానే కనెక్టివిటీ, డేటా సమాజం అందుబాటులోకి వచ్చాయని అంబానీ వివరించారు.

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2017 (02:19 IST)
ఆధునిక యుగానికి కొత్త సహజ వనరు డేటాయే అని రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. ఈ యుగంలో డేటాను రూపొందించాలంటే అనేకమది ప్రజలు మీ వద్ద ఉండాలని, ఆ రకంగా చూస్తే 120 కోట్లమంది ప్రజలు భారత్‌కు వరంలాంటి వారని ముఖేష్ ప్రశంసించారు.
 
ఒక కొత్త యుగం ఆరంభంలో మనం ఉంటున్నాం. ఈ యుగంలో కొత్త ఇంధనం డేటాయే. భారత్ దేశంలోని యువజనాభా తన నైపుణ్యంతో ప్రపంచం మొత్తం మీద పోటీలో ముందు ఉంటుందని ముఖేష్ తెలిపారు.  టెక్నాలజీ పలు వాణిజ్య కలాపాలపై ఎలాంటి ప్రభావం వేస్తుందో చెప్పడానికి ఆధార్ ఒక పెద్ద ఉదాహరణ అని ముఖేష్ తెలిపారు. నాలుగో పారిశ్రామిక విప్లవం యొక్క పునాది కనెక్టివిటీ మరియు డేటాయేనని, భౌతిక, డిజిటల్, జీవపరమైన అన్ని శాస్త్రాల సమ్మేళనం ఫలితంగానే కనెక్టివిటీ, డేటా సమాజం అందుబాటులోకి వచ్చాయని అంబానీ వివరించారు.
 
భారతీయ వాణిజ్య నైపుణ్యాలపై తనకు అపార విశ్వాసం ఉందని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. యువ భారతీయలు ఒక్కటైన ప్రతి సందర్భంలోనూ మనకు నూతన అవకాశాలు బహుమతిగా వస్తున్నాయని, మన యువత అద్భుత కృషి చేస్తూ అధిక ఫలితాలను సాధిస్తున్నారని ముఖేష్ కొనియాడారు.  
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments