Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళిత మహిళపై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (17:12 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళపై ఇద్దరు ముస్లిం యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తమ చర్యను వీడియో తీసి బాధితురాలి భర్తకు కూడా పంపించారు. అంతటితో ఆగకుండా ఆ మహిళతో బలవంతంగా బీఫ్ తినిపించారు. ఈ దారుణ ఘటన రాయ్‍బరేలి జిల్లాలో జరిగింది. 
 
ఈ జిల్లాకు చెందిన ఓ దళిత యువతి.. తన ముస్లిం స్నేహితురాలి కొంత డబ్బును అప్పుగా ఇచ్చింది. దాన్ని తిరిగి ఇవ్వాలని కోరింది. దీంతో సెప్టెంబరు 2వ తేదీన ఒక కేఫ్‌కు రావాలని దళిత యువతికి ముస్లిం స్నేహితురాలు ఫోన్ చేసి చెప్పింది. దీంతో ఆమె చెప్పిన కేఫ్ వద్దకు దళిత యువతి వెళ్లింది. అప్పటికే తన స్నేహితురాలితో పాటు మరో ఇద్దరు ముస్లిం యువకులు కూడా ఉన్నారు. అందులో ఒకరు బీఫార్మసీ విద్యార్థి షోయబ్ కాగా, మరొకరు బార్బర్‌గా పని చేసే నజీమ్. 
 
వీరంతా కలిసి ఆ యువతిని హోటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆ యువకులు ఆమెతో బలవంతంగా బీఫ్ తినిపించారు. ఆ తర్వాత సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ తతంగాన్నంతా వీడియో తీసి, దాన్ని ఆమె భర్తకు పంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారు. పైగా, రూ.5 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేయసాగారు. వారి వేధింపులను భరించలేని బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులందరినీ అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments