Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళిత మహిళపై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (17:12 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళపై ఇద్దరు ముస్లిం యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తమ చర్యను వీడియో తీసి బాధితురాలి భర్తకు కూడా పంపించారు. అంతటితో ఆగకుండా ఆ మహిళతో బలవంతంగా బీఫ్ తినిపించారు. ఈ దారుణ ఘటన రాయ్‍బరేలి జిల్లాలో జరిగింది. 
 
ఈ జిల్లాకు చెందిన ఓ దళిత యువతి.. తన ముస్లిం స్నేహితురాలి కొంత డబ్బును అప్పుగా ఇచ్చింది. దాన్ని తిరిగి ఇవ్వాలని కోరింది. దీంతో సెప్టెంబరు 2వ తేదీన ఒక కేఫ్‌కు రావాలని దళిత యువతికి ముస్లిం స్నేహితురాలు ఫోన్ చేసి చెప్పింది. దీంతో ఆమె చెప్పిన కేఫ్ వద్దకు దళిత యువతి వెళ్లింది. అప్పటికే తన స్నేహితురాలితో పాటు మరో ఇద్దరు ముస్లిం యువకులు కూడా ఉన్నారు. అందులో ఒకరు బీఫార్మసీ విద్యార్థి షోయబ్ కాగా, మరొకరు బార్బర్‌గా పని చేసే నజీమ్. 
 
వీరంతా కలిసి ఆ యువతిని హోటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆ యువకులు ఆమెతో బలవంతంగా బీఫ్ తినిపించారు. ఆ తర్వాత సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ తతంగాన్నంతా వీడియో తీసి, దాన్ని ఆమె భర్తకు పంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారు. పైగా, రూ.5 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేయసాగారు. వారి వేధింపులను భరించలేని బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులందరినీ అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments