Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉచితంగా చికెన్ ఇవ్వలేదని దళితుడిని చెప్పులతో చావగొట్టారు...

Webdunia
ఆదివారం, 13 ఆగస్టు 2023 (11:00 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అణగారిన వర్గాలకు చెందిన ప్రజలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పలు రకాలైన దాడి ఘటనలు వెలుగుచూశాయి. తాజాగా ఓ దళితుడిపై చెప్పులతో చావబాదారు. ఇంతకీ అతను చేసిన నేరం ఏంటంటే.. ఉచితంగా చికెన్ ఇవ్వకపోవడమే. దీంతో అతనిపై చెప్పులతో చావగొట్టారు. ఈ ఘటన లలిత్ పూర్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
లలిత్‌పూర్ జిల్లాలో ఓ దళిత వ్యక్తి ఊరారా తిరుగుతూ చికెన్ అమ్మే వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో కొందరు యువకులు ఉచితంగా చికెన్ ఇవ్వాలని అడిగ్గా, అందుకు నిరాకరించాడు. దీంతో అతనిపై రోడ్డుపైనే చెప్పులతో చావబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. మద్యం మత్తులో ఉన్న నిందితులు బాధితుడు సుజన్ అహిర్వాన్‌ను నడిరోడ్డుపై చెప్పులతో కొడుతుండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. 
 
బైకుపై తిరుగుతూ గ్రామాల్లో చికెన్‌ విక్రయించే అహిర్వార్ వద్ద నిందితులు చికెన్ తీసుకున్నారు. డబ్బులు అడగడంతో ఆగ్రహించిన నిందితులు... అతడిని పట్టుకుని ఈడ్చుకుంటూ చెప్పులతో దాడి చేశారు. తనను వదిలేయాలని ఎంతగానో ప్రాధేయపడినా కనికరం చూపలేదు కదా మరింతగా దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు... నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments