Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రచండ ఫణి... పూరీ వద్ద తీరాన్ని తాకిన పెను తుఫాను

Webdunia
శుక్రవారం, 3 మే 2019 (10:40 IST)
గతవారం రోజులుగా భయపెడుతూ వచ్చిన ఫణి తుఫాను ఎట్టకేలకు ఒడిషా రాష్ట్రంలోని పూరీ వద్ద తీరాన్ని తాకింది. ఈ తుఫాను తీరాన్ని తాకే సమయంలో ఇది గంటకు 22 కిలోమీటర్ల వేగంతో పయనించింది. శుక్రవారం ఉదయం 11 గంటల సమయానికి ఇది పూర్తిగా తీరాన్ని దాటుకుందని, ఆపై క్రమంగా బలహీనపడుతుందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 
 
అయితే, ఈ తుఫాను తీరందాటే సమయంలో గాలులు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. ఒడిషా రాష్ట్రంలో ఈతుఫాను ప్రభావం 10 వేలకు పైగా గ్రామాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ తుఫాను శుక్రవారం మధ్యాహ్నానికి పూర్తిగా బలహీనపడి... ఆ తర్వాత బంగ్లాదేశ్ వైపు పయనించవచ్చని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. 
 
మరోవైపు ఈ ప్రచండ తుఫాను ముప్పు నుంచి శ్రీకాకుళం జిల్లా బయటపడిందని ఆ జిల్లా కలెక్టర్ జె.నివాస్ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఫణి తుఫాను జిల్లాకు దూరంగా తీరం దాటటడంతో పెను ముప్పు తప్పినట్టేనని ఆయన వెల్లడించారు. అయితే, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందుకు అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. 
 
తుఫాను ప్రభావం దృష్ట్యా గురువారం రాత్రంతా కలెక్టరేట్‌లోనే బస చేసిన ఆయన... ఫణి తుఫాను తీరందాటిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ తుఫాను తీరప్రాంత మండలాలపై తీవ్ర ప్రభావం చూపిందనీ, ఇచ్ఛాపురంలో 140 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయని చెప్పారు. ఈ గాలుల ప్రభావానికి గుడిసెలు కూలిపోగా, విద్యుత్ స్తంభాలు నేలకొరిగినట్టు చెప్పారు. కంచిలి మండలంలో 19 సెంటీమీటర్ల మేరకు వర్షపాతం నమోదైందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప మూవీ రివ్యూ- కథ మారింది-కల్పితం: నేటి జనరేషన్ నిజం అని నమ్మే ప్రమాదం వుంది!

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments