మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాల్లో ఏడాది పాటు 30 శాతం కోత..ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (17:57 IST)
కర్ణాటకలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాల్లో ఏడాది పాటు 30 శాతం కోత విధించనున్నారు. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని రాష్ట్ర కేబినెట్ గురువారం ఆమోదించింది.

కరోనా పై పోరాటానికి ప్రభుత్వానికి ఆర్థిక వనరులు సమాకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు పలికారు. దేశ వ్యాప్తంగా కేంద్రమంత్రులు, ఎంపీల వేతనంలోనూ రెండేళ్ల పాటు 30 శాతం కోత విధిస్తూ ఇటీవలే మోడీ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

”మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ వేతనాల్లో ఈ నెల నుంచి కోత విధిస్తున్నాం. మొత్తం రూ.15. 36 కోట్లు ప్రభుత్వానికి సమకూరుతాయి” అని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి జేసీ మధుస్వామి చెప్పారు. అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపామని వేతనాల్లో కోతకు అందరూ అంగీకరించారన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments