Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉధంపూర్‌లో సిఆర్‌పిఎఫ్ వాహనం బోల్తా: ముగ్గురు మృతి, 12 మందికి గాయాలు

ఐవీఆర్
గురువారం, 7 ఆగస్టు 2025 (13:45 IST)
జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలోని బసంత్‌గఢ్ ప్రాంతంలో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. ఒక సిఆర్‌పిఎఫ్ వాహనం లోతైన గుంతలో పడి కనీసం ముగ్గురు సిఆర్‌పిఎఫ్ జవాన్లు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. వారిలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో బసంత్‌గఢ్ ప్రాంతంలోని కాండ్వా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
 
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారని, గాయపడిన వారందరినీ చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించామని ఉధంపూర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ సందీప్ భట్ తెలిపారు. వాహనం వందల అడుగుల కిందకు పడిపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, అందులో ఉన్న కొంతమంది తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు.
 
కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఉధంపూర్ డిసితో మాట్లాడానని, గాయపడిన జవాన్లకు అన్ని విధాలా సహాయం అందిస్తున్నామని చెప్పారు. ఉదంపూర్ కాండ్వా-బసంత్‌గఢ్ ప్రాంతంలో సిఆర్‌పిఎఫ్ వాహనం రోడ్డు ప్రమాదానికి గురైందనే వార్త విని తాను బాధపడ్డానని జితేంద్ర సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments