Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదేళ్ల బాలుడిని తినేసిన మొసలి... కొట్టి చంపేసిన గ్రామస్థులు

Webdunia
బుధవారం, 14 జూన్ 2023 (07:30 IST)
బీహార్ రాష్ట్రంలో ఇటీవల ఓ మొసలి పదేళ్ల బాలుడిని చంపేసి భక్షించింది. ఆ తర్వాత నదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు ఆ మొసలిని అంతమొందించాలన్న నిర్ణయానికి వచ్చారు. అంతే.. నదిలోని మొసలిని బయటకు లాగి కొట్టి చంపేశారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని వైశాలి జిల్లా, రాఘోపూర్ దియారా గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దియారా గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఇటీవల కొత్త బైక్ కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఈ వాహన పూజకు కావాల్సిన పవిత్ర జలం కోసం అమిత్ కుమార్ అనే బాలుడు గంగానదిలోకి దిగాడు. 
 
అమిత్ నదిలో స్నానం చేస్తుండగా, మొసలి దాడి చేసి, అతడిని కుటుంబ సభ్యుల ముందే తిలేసింది. దీంతో కటుుంబ సభ్యులు గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆ తర్వాత గ్రామస్థులంతా కలిసి బాలుడుని చంపిన మొసలి పట్టుకుని నదిలో నుంచి బయటకులాగి ఇనుపరాడ్లు, కర్రలతో కొట్టి చంపేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments