Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేరగాళ్లను కాల్చి చంపేస్తున్నాం : సీఎం యోగి ఆదిత్యనాథ్

తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగా మెరుగుపడినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభిప్రాయపడ్డారు. త్వరలో మునిసిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఘజియాబా

Webdunia
ఆదివారం, 19 నవంబరు 2017 (12:09 IST)
తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగా మెరుగుపడినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభిప్రాయపడ్డారు. త్వరలో మునిసిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఘజియాబాద్‌లోని రామ్‌లీలా గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగుపడినట్టు చెప్పారు. నేరగాళ్లను జైలుకు పంపడమో, ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపడమో చేస్తున్నట్టు చెప్పారు. 
 
2017కు ముందు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపులో ఉండేది కాదు. నేరాలు ఇష్టానుసారం జరిగేవి. దీంతో భయపడిన వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, యువత రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన వారు తిరిగి వస్తున్నట్టు చెప్పుకొచ్చారు. పెట్టుబడులు వస్తున్నాయన్నారు. నేరగాళ్లకు ఇప్పుడు రెండే చోట్లు ఉన్నాయని, ఒకటి జైలుకు వెళ్లడం, లేదంటే యమరాజు ఇంటికి వెళ్లడమని వివరించారు. ఎక్కడికి వెళ్తారో వారే తేల్చుకోవాలని ముఖ్యమంత్రి హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

Prabhas: నిర్మాత వదిలేసినా, ఇండస్ట్రీ వద్దన్నా మారుతీ తో ప్రభాస్ రాజాసాబ్ ఎందుకు చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments