Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా టీకాల ధర ఎంత?

Webdunia
బుధవారం, 9 జూన్ 2021 (09:20 IST)
కరోనా వైరస్ బారినపడకుండా ఉండేందుకు ప్రజలంతా వ్యాక్సిన్లు వేయించుకోవాలని ప్రభుత్వాలు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి దేశ ప్రజలందరికీ ఉచితంగా టీకాలు వేస్తామని ప్రకటించింది. అదేసమయంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో టీకాలు వేయించుకునేందుకు ఆసక్తి చూపనివారు ప్రైవేటు ఆస్పత్రుల్లో డబ్బులు చెల్లించి టీకాలు వేయించుకోవచ్చని తెలిపింది. పైగా, పైవేటు ఆస్పత్రుల్లో టీకాల ధరను కూడా నిర్ణయించింది. 
 
తాజాగా నిర్దేశించిన రేట్ల ప్రకారం.. సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ఒక డోసు ధర రూ.780, రష్యాకు చెందిన స్పుత్నిక్‌ వీ టీకా రేటు రూ.1,145, భారత్‌ బయోటెక్‌ కంపెనీ కొవాగ్జిన్‌ టీకా ధర రూ.1,410గా నిర్ణయించింది. 
 
అన్ని పన్నులతో పాటు ఆసుపత్రులకు చెల్లించే సర్వీస్‌ చార్జి రూ.150 ఇందులో భాగమేనని కేంద్రం స్పష్టం చేసింది. ప్రైవేటు దవాఖానాలు సర్వీస్‌ చార్జి రూ.150 కంటే ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరింది.
 
ఈ మేరకు ఆయా దవాఖానాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించింది. ఈ నెల 21 నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ టీకాలు ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రధాని సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. 
 
కంపెనీలు ఉత్పత్తి చేసే వ్యాక్సిన్లలో 75శాతం కేంద్రమే కొనుగోలు చేసి ఉచితంగా ఇవ్వనుండగా.. ఉచితంగా వద్దనుకునే వారికి టీకాలు వేసేందుకు 25శాతం ప్రైవేటు ఆసుత్రులకు ఇస్తున్నట్లు కేంద్రం పేర్కొంది.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments