Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైంది : సీఎం నితీశ్ కుమార్

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (14:11 IST)
బిహార్ రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాదితో పాటు.. ఢిల్లీలో పాజిటివ్ కేసులు పెరగడమే దీనికి నిదర్శనమని ఆయన చెప్పారు. ఒకవైపు కరోనా పాజిటివ్ కేసులతో పాటు.. మరోవైపు, ఒమిక్రాన్ కేసులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం నితీశ్ వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా మారాయి. 
 
ముఖ్యంగా, బీహార్ రాష్ట్రంలో కరోనా మూడో దశ వ్యాప్తి మొదలైందని ఆయన చెప్పారు. బుధవారం ఆయన ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 47 కోవిడ్ కేసులు నమోదైన నేపథ్యంలో రాష్ట్రంలో థర్డ్ వేవ్ ప్రారంభమైనట్టుగా భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. 
 
అయితే పొరుగు రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేసినా, మన రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు ఇంకా లేదన్నారు. ఒకవేళ పాజిటివ్ కేసులు పెరిగితే మాత్రం నైట్ కర్ఫ్యూను అమలు చేసే అంశాన్ని ఆలోచన చేస్తామని తెలిపారు. అలాగే, దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆయన గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments