Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కోరోనిల్' పేరుతో కరోనాకు పతంజలి మందు.. 5 నుంచి 14 రోజుల్లో...?

Webdunia
మంగళవారం, 23 జూన్ 2020 (13:00 IST)
corona medicine
'కోరోనిల్' పేరుతో కరోనాకు ఆయుర్వేద మందు తీసుకువచ్చినట్లు దేశీయ కంపెనీ పతంజలి తెలిపింది. ఈ మందును మార్కెట్లోకి తీసుకువచ్చినట్లు బాబా రాందేవ్‌ తెలిపారు. హరిద్వార్‌లోని యోగ్‌పీఠ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మందును ఆవిష్కరించారు. 
 
'కరోనిల్' మాత్రల ద్వారా 14 రోజుల్లో కరోనాను నయం చేయవచ్చని పతంజలి సంస్థ పేర్కొంది. కరోనా వైరస్‌కు మందును తీసుకువస్తున్నామని గతంలోనే పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ తెలిపారు. తమ మందు 5 నుంచి 14 రోజుల్లో కోవిడ్‌ను నయం చేయగలదని పేర్కొన్నారు.
 
ఈ సందర్భంగా రాందేవ్‌ మాట్లాడుతూ.. 'కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఇలాంటి విపత్కర సమయంలో మందు తీసుకురావడం ముఖ్యమైన ప్రక్రియ అన్నారు. 
 
ఆయుర్వేదంతో కరోనాను నయం చేయవచ్చునని చెప్పుకొచ్చారు. ఈ మందుతో మూడు రోజుల పరిశీలనలో 69 శాతం మందికి నెగిటివ్‌ రావడం శుభసూచకమన్నారు. మందును తీసుకురావడంలో తమ శాస్త్రవేత్తలు చేసిన కృషి అభినందనీయమని రాందేవ్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments