Webdunia - Bharat's app for daily news and videos

Install App

భువనేశ్వర్‌: నాలుగేళ్ల బాలికను.. రూ.40వేలకు అమ్మేశారు.. ఎందుకంటే?

సెల్వి
గురువారం, 28 నవంబరు 2024 (09:21 IST)
భువనేశ్వర్‌లో నాలుగేళ్ల బాలికను తల్లిదండ్రులు రూ.40 వేలకు అమ్మేసిన ఘటన సంచలనం సృష్టించింది. బీహార్‌కు చెందిన రోజువారీ కూలీలైన దంపతులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల కారణంగా బాలికను అమ్మేశారని పోలీసుల విచారణలో వెల్లడి అయ్యింది. 
 
వివరాల్లోకి వెళితే.. బడగడ ప్రాంతానికి చెందిన ఇద్దరు మధ్యవర్తుల సహకారంతో చిన్నారిని పిపిలిలోని మరో దంపతులకు విక్రయించారు. పక్కా సమాచారంతో వెంటనే రంగంలోకి దిగిన బడగడ పోలీసులు బాలికను రక్షించి కేసు దర్యాప్తు చేపట్టారు. 
 
దంపతులు పనిచేస్తున్న ఓ అపార్ట్‌మెంట్ యజమాని తమను అప్రమత్తం చేశారని బడగడ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ తృప్తి రంజన్ నాయక్ వెల్లడించారు. దీనిని అనుసరించి.. మధ్యవర్తులను పోలీసులు గుర్తించారు. పేదరికం కారణంగా కూలీలు అయిన దంపతులు తమ బిడ్డను అమ్మారని విచారణలో పోలీసులకు తెలియవచ్చింది. 
 
గతవారం, బోలంగీర్ జిల్లాలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా నవజాత శిశువును ఆమె తల్లిదండ్రులు విక్రయించారని ఆరోపిస్తూ రక్షించారు. ఇలాంటి ఘటనలు భువనేశ్వర్‌లో అధికంగా నమోదు అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments