భువనేశ్వర్‌: నాలుగేళ్ల బాలికను.. రూ.40వేలకు అమ్మేశారు.. ఎందుకంటే?

సెల్వి
గురువారం, 28 నవంబరు 2024 (09:21 IST)
భువనేశ్వర్‌లో నాలుగేళ్ల బాలికను తల్లిదండ్రులు రూ.40 వేలకు అమ్మేసిన ఘటన సంచలనం సృష్టించింది. బీహార్‌కు చెందిన రోజువారీ కూలీలైన దంపతులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల కారణంగా బాలికను అమ్మేశారని పోలీసుల విచారణలో వెల్లడి అయ్యింది. 
 
వివరాల్లోకి వెళితే.. బడగడ ప్రాంతానికి చెందిన ఇద్దరు మధ్యవర్తుల సహకారంతో చిన్నారిని పిపిలిలోని మరో దంపతులకు విక్రయించారు. పక్కా సమాచారంతో వెంటనే రంగంలోకి దిగిన బడగడ పోలీసులు బాలికను రక్షించి కేసు దర్యాప్తు చేపట్టారు. 
 
దంపతులు పనిచేస్తున్న ఓ అపార్ట్‌మెంట్ యజమాని తమను అప్రమత్తం చేశారని బడగడ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ తృప్తి రంజన్ నాయక్ వెల్లడించారు. దీనిని అనుసరించి.. మధ్యవర్తులను పోలీసులు గుర్తించారు. పేదరికం కారణంగా కూలీలు అయిన దంపతులు తమ బిడ్డను అమ్మారని విచారణలో పోలీసులకు తెలియవచ్చింది. 
 
గతవారం, బోలంగీర్ జిల్లాలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా నవజాత శిశువును ఆమె తల్లిదండ్రులు విక్రయించారని ఆరోపిస్తూ రక్షించారు. ఇలాంటి ఘటనలు భువనేశ్వర్‌లో అధికంగా నమోదు అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments