Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవినీతి న్యాయమూర్తి అంశంపై మన్మోహన్ మౌనం వీడాలి: వెంకయ్య

Webdunia
బుధవారం, 23 జులై 2014 (14:35 IST)
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక న్యాయమూర్తిని మద్రాసు హైకోర్టు జడ్జీగా నియమించారంటూ మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ చేసిన ఆరోపణలపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మౌనం వీడాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి వెంకయ్య నాయుడు కోరారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... అవినీతి జడ్జి పదవీ కాలాన్ని పొడిగించేందుకు యూపీఏ హయాంలో ప్రయత్నించారంటూ వచ్చిన ఆరోపణలపై స్పందించాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ని కోరారు. దానిపై నిర్ధిష్టమైన ప్రకటన చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు చెప్పారు. 
 
ఈ విషయన్నంతటినీ ముందుగా సుప్రీంకోర్టు మాజీ జడ్జి మార్కండేయ కట్జూ వెల్లడించారన్నారు. యూపీఏ హయాంలో ప్రభుత్వం ఎలా పనిచేసిందో ఈ విషయం ద్వారా తెలుస్తుందని, ప్రతి అంశంలోనూ రాజీకోసం ప్రయత్నిస్తున్నట్లు ఉందని ఆరోపించారు. కాగా, మన్మోహన్ దీనిపై నిశ్శబ్ధంగా ఉండటంవల్ల ఏదో దాస్తున్నట్లే అనిపిస్తుందని చెప్పారు.
 
అందువల్ల మాజీ పీఎం తక్షణమే సదరు అంశంలో అప్పట్లో ఏం జరిగిందో స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. దానివల్ల న్యాయవ్యవస్థ ప్రతిష్ట పెరిగేందుకు సహాయపడుతుందని పేర్కొన్నారు. అంతేకాక మాజీ ఎంపీ ద్వారా ఎవరైనా అలాంటి తప్పుడు ప్రకటన చేయించినట్లైతే వారిని తీసివేస్తామని వెంకయ్య అన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవబోతున్న నిర్మాతలు

పవన్ కల్యాణ్ క్యూట్ ఫ్యామిలీ పిక్చర్‌ వైరల్

అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి: నవ్వొచ్చినా.. ఏడుపొచ్చినా ఆపుకోలేదు..

షారూఖ్ ఖాన్ సరసన సమంత.. అంతా సిటాడెల్ ఎఫెక్ట్

బైరెడ్డితో పెళ్లి లేదు.. అవన్నీ రూమర్సే.. ఆపండి.. శ్రీరెడ్డి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

Show comments