Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో కరోనా విలయతాండవం.. 24 గంటల్లో 49,310 కేసులు

Coronavirus
Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (11:40 IST)
భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 49,310 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనా సోకి 740 మంది మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 
 
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన తరువాత ఒక రోజు వ్యవధిలో నమోదు అయిన అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. వీటితో కలిపి దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 12,87,945కి చేరింది. ఈ మహమ్మారి భారీన పడి 30,061 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
మరోవైపు దేశంలో కరోనా రికవరీ రేటు 63.18శాతంగా ఉంది. దేశంలో మొత్తం 1,54,28,170 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. గురువారం ఒక్కరోజులో 3,52,801 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 
 
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో కొనసాగుతోంది. అమెరికాలో 41లక్షల పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 12లక్షల కేసులతో బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉంది. ఇక అత్యధిక మరణాలు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ 6వ స్థానానికి చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments