దొంగకు కరోనా పాజిటివ్: అరెస్ట్ చేసిన పోలీసులకు, తీర్పు చెప్పిన జడ్జికి క్వారంటైన్!

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2020 (07:52 IST)
పంజాబ్ లోని లూథియానాలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ దొంగకు కరోనా పాజిటివ్ అని తేలడంతో, అతడ్ని అరెస్ట్ చేసిన పోలీసులను, తీర్పు ఇచ్చిన జడ్జిని క్వారంటైన్ తప్పలేదు.

లూథియానాలోని జనక్ పురి గణేశ్ కాలనీకి చెందిన 24 ఏళ్ల యువకుడు మోటార్ బైక్, మొబైల్ ఫోన్ చోరీ చేసి పోలీసులకు పట్టుబడ్డాడు.

పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసులు చోరీ చేసిన బైక్ పై వస్తున్న ఆ యువకుడ్ని, చోరీలో అతడికి సహకరించిన మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. వీరిద్దరిపై పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. 
 
అతడ్ని కోర్టులో హాజరుపర్చగా, అనారోగ్యంతో బాధపడుతున్నట్టు న్యాయమూర్తి మోనికా చౌహాన్ గుర్తించారు. అతడితో పాటు మరో అనుచరుడు కూడా జ్వరం, దగ్గుతో బాధపడుతుండడంతో వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసులను ఆదేశించారు.

వైద్య పరీక్షకు ముందే మరో వ్యక్తి తప్పించుకోగా, దొంగతనం చేసిన యువకుడికి కరోనా పాజిటివ్ అని వచ్చింది. దాంతో అతడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు, కోర్టుకు తీసుకెళ్లిన పోలీసులు మొత్తం 17 మందితో పాటు జడ్జి మోనికా చౌహాన్ సైతం క్వారంటైన్ లోకి వెళ్లాల్సి వచ్చింది.

అంతేకాదు, ఆ దొంగను ఉంచిన పోలీస్ స్టేషన్ ను అణువణువు శానిటైజ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments