Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో 647కి చేరిన కరోనా కేసులు..

Webdunia
గురువారం, 26 మార్చి 2020 (11:42 IST)
భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. గురువారం నాటికి దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ నిర్థారణ కేసుల సంఖ్య 647కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. కొవిడ్‌-19కారణంగా ఇప్పటివరకు మొత్తం 13మంది మృతి చెందినట్లు ప్రకటించింది. మొత్తం బాధితుల్లో 43మంది కోలుకోగా 593మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 
 
మహారాష్ట్రలో అత్యధికంగా 124కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. వీరిలో ఒకరు కోలుకోగా మరో ముగ్గురు మరణించారు. కేరళలో ఈ కేసుల సంఖ్య 118కి చేరగా వీరిలో నలుగురు కోలుకున్నారు. ఇక తెలంగాణలో 41కేసులు, ఏపీలో 11 కేసులు, గోవాలో మూడు కరోనా వైరస్‌ కేసులు, కాశ్మీర్‌లో తొలి కరోనా మరణం నమోదైంది. 
 
హైదర్‌పోరా గ్రామంలో కొవిడ్‌-19 కారణంగా 65ఏళ్ల వ్యక్తి మరణించినట్లు కాశ్మీర్‌ వైద్య అధికారులు వెల్లడించారు. అనంతరం ఈ వ్యక్తి కుటుంబంలోని నలుగురికి కూడా వైరస్‌ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. మరణించిన వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వం అన్నివిధాలా సాయం చేస్తామని శ్రీనగర్‌ మేయర్‌ జునైద్‌ అజీం ట్విట్టర్‌లో తెలిపారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments