Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనియా గాంధీకి వైరల్ ఫీవర్.. శ్రీ గంగా ఆస్పత్రిలో చేరిక.. సుర్జేవాలా

కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాందీ మరోసారి ఆస్పత్రి పాలయ్యారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచార ర్యాలీని ప్రారంభించిన ఆమె.. అక్కడ ప్రచారరథం మీద నుంచి పడిపోవడంతో చేతికి గాయమైంది. అప్పట్లో ఆమెను ఢిల్లీలోని

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2016 (16:05 IST)
కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాందీ మరోసారి ఆస్పత్రి పాలయ్యారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచార ర్యాలీని ప్రారంభించిన ఆమె.. అక్కడ ప్రచారరథం మీద నుంచి పడిపోవడంతో చేతికి గాయమైంది. అప్పట్లో ఆమెను ఢిల్లీలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చాలా కాలం పాటు ఆమెకు చికిత్స అందించాల్సి వచ్చింది. తాజాగా వైరల్ ఫీవర్ కారణంగా ఆమెను ఢిల్లీ శ్రీ గంగా ఆస్పత్రిలో చేర్చినట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుర్జేవాలా ప్రకటించారు. 
 
గతంలో కేన్సర్ బారిన పడిన సోనియా గాంధీకి అమెరికాలో చికిత్స అందించారు. గడిచిన మూడు నెలల్లో సోనియా గాంధీని ఆస్పత్రికి తరలించడం ఇది రెండోసారి అని.. రెండు రోజుల పాటు ఆమె గంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతారని సుర్జేవాలా తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 3వ తేదీన సోనియా గాంధీని భుజం నొప్పి, డీహైడ్రేషన్‌తో ఆస్పత్రిలో చేర్చారు. ఆ సందర్భంగా ఆమెకు చిన్నపాటి శస్త్రచికిత్స కూడా చేశారు. ప్రస్తుతం జ్వరం కారణంగా ఆమె ఆస్పత్రిలో చేరినట్లు సుర్జేవాలా ప్రకటించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments