Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోట్ల రద్దుపై సభలో మాట్లాడే ధైర్యం ప్రధాని మోడీకి లేదు: ఎంపీ దినేష్

పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్ ఉభయ సభల్లో మాట్లాడే ధైర్యం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించించింది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి పెద్ద నోట్ల రద్దు అంశం

Webdunia
మంగళవారం, 22 నవంబరు 2016 (14:36 IST)
పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్ ఉభయ సభల్లో మాట్లాడే ధైర్యం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించించింది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి పెద్ద నోట్ల రద్దు అంశంపై ఉభయ సభలను కుదిపేస్తోంది. పెద్ద నోట్ల రద్దుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకు వచ్చి వివరణ ఇవ్వాలంటూ అన్ని విపక్ష పార్టీల నేతలు పట్టుబడుతున్నారు. కానీ, ప్రధాని మాత్రం ఉభయ సభల మొహం కూడా చూడటం లేదు. 
 
దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ దినేష్ గుండురావు మాట్లాడుతూ.. ప్రధాని మోడీ రాను రాను నియంతలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఎవరికీ పేరు రాకూడదనే ఉద్దేశంతోనే ప్రధాని ఇలా వ్యవహరిస్తున్నారన్నారు. 'ఇది ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. ప్రధానికి పార్లమెంటd ఒక్క ముక్క కూడా మాట్లాడాలని అనిపించడం లేదు. ఆయన రాను రాను మరింత నియంతృత్వ ధోరణి అవలంభిస్తున్నారు' అని వ్యాఖ్యానించారు. 
 
పెద్ద నోట్ల రద్దుపై జపాన్‌, గోవా, కర్నాటక, ఉత్తరప్రదేశ్ వంటి చోట్ల మాట్లాడగా లేనిది.. పార్లమెంటులో మాట్లాడేందుకు ఆయన ఎందుకు వెనక్కితగ్గుతున్నారని ప్రశ్నించారు. 'దురదృష్టమేంటంటే... పార్లమెంటుకు వచ్చి తోటి పార్లమెంటు సభ్యులతో మాట్లాడాలన్న ఆసక్తి కూడా ప్రధానమంత్రికి లేనట్టు కనిపిస్తోంది. పెద్ద నోట్లను రద్దు చేయడానికి కారణమేంటి, ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారనే దానిపై వివరణ ఇచ్చి సభ్యులను ఒప్పించే ప్రయత్నం చేయ్యెచ్చు కదా?' అని దినేశ్ వ్యాఖ్యానించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments