Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీని వీడిన సోనియా గాంధీ .. పనాజీలో మకాం!

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (17:14 IST)
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీలు దేశ రాజధాని ఢిల్లీని వీడారు. ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పటికే ఛాతి ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న సోనియా.. వైద్యుల సలహా మేరకు ఢిల్లీని వదిలారు. ప్రస్తుతం గోవా రాష్ట్ర రాజధాని పనాజీకి చేరుకున్నారు. ఆమె వెంట కుమారుడు రాహుల్ గాంధీకూడా ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం పనాజీకి వచ్చారు. 
 
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సోనియా ఇటీవల వైద్యులను సంప్రదించగా కాలుష్యం తక్కువగా ఉన్న ప్రాంతంలో గడపాలని సూచించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ దేశ రాజధాని ఢిల్లీని వీడుతున్నట్లు శుక్రవారం ఉదయం ప్రకటించారు. 
 
కొంతకాలంగా సోనియా ఛాతి సంబంధ సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీలో కాలుష్యం కోరలు చాస్తుండటంతో పలువురు శ్వాసకోశ, గొంతు సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సోనియా కొద్ది రోజులపాటు పనాజీలో ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments