ఇప్పటికే చౌహాన్ను తొలగించాలంటూ రాణేతో పాటు మహారాష్ట్రకు చెందిన అనేక మంది సీనియర్ మంత్రులు, నాయకులు కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో.. తాజాగా అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్కు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు ఒక్కటి కావడం కాంగ్రెస్ అధిష్టానం జీర్ణించుకోలేక పోతోంది.
గత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసినప్పటి నుంచీ చౌహాన్కు ఉద్వాసన పలకాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతూనే వచ్చాయి. రాణే రాజీనామాతో పరిస్థితి మరింత వేడెక్కినట్టయింది. లోక్ సభ ఎన్నికల్లో వైఫల్యానికి ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ అసమర్థ నాయకత్వమే కారణమంటూ అస్సాం కాంగ్రెస్ ప్రభుత్వంలో ముసలం మొదలైంది. దాదాపు 38మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గగోయ్ నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. కాంగ్రెస్ అధినాయకత్వం నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు రాకపోవడంతో సోమవారం వరకూ డెడ్లైన్ విధించారు.