Webdunia - Bharat's app for daily news and videos

Install App

జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష

Webdunia
ఆదివారం, 19 జూన్ 2022 (14:37 IST)
సాయుధ బలగాలలో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. దీన్ని అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రధానంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా నిరుద్యోగులు రోడ్లెక్కారు. ఫలితంగా అనేక రాష్ట్రాల్లో హింసాకాండ, ఘర్షణలు చెలరేగాయి. ఈ క్రమంలో అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ పేరుతో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్షకు దిగింది. 
 
ఈ పథకానికి వ్యతిరేకంగా యువకుల ఆందోళనలకు ఇప్పటికే సంఘీభావం ప్రకటించిన కాంగ్రెస్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆదివారం ఉదయం 10 గంటలకు ఈ సత్యాగ్రహ దీక్షను మొదలుపెట్టింది. 
 
ఇందులో ప్రియాంకా గాంధీతో పాటు ఆ పార్టీ ఎంపీలు, కాంగ్రెస్ సభ్యులు, ఏఐసీసీ ఆఫీస్ బేరర్లు దీక్షలో కూర్చొన్నారు. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని ప్లకార్డులు పెట్టుకుని నినాదాలు చేస్తున్నారు. మరోవైపు, జంతర్ మంతర్ వద్ద భారీ సంఖ్యంలో పోలీసు బలగాలను మొహరించారు. 
 
ఈ చర్యను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టారు. బ్రిటీష్ పాలకుల పోలీసులు,స లాఠీలు బ్యారికేడ్రను గాంధీజీ సత్యాగ్రహాన్ని ఆపలేకపోయాయని గుర్తుచేశారు. ఇపుడు అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశంలో సాగుతున్న సత్యాగ్రహాన్ని ఆపగలరా అని ప్రశ్నించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

ఈ ఫ్లూకీతో పాటు 6 వీధి కుక్కలు ఇప్పుడు నా కుటుంబం: నటి వామికా గబ్బీ (video)

Rajinikanth: 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ప్రధాని శుభాకాంక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments