Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికను ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు.. ప్రధాని మోదీపై పిటిషన్

Webdunia
బుధవారం, 23 నవంబరు 2022 (15:19 IST)
Modi
బాలికను ఎన్నికల ప్రచారానికి వాడుకున్నందుకు ప్రధాని మోదీపై కాంగ్రెస్ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌లో పిటిషన్‌ దాఖలు చేసింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ విడుదలైన వీడియోలో ప్రధాని మోదీ పక్కన నిలబడిన ఓ బాలిక తన గుజరాతీ భాషలో బీజేపీకి అనుకూలంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేసింది. అలాగే మోదీని, బీజేపీని పొగిడిన అమ్మాయి మెడలో బీజేపీ లోగో ఉన్న దుపట్టా ఉంది.
 
రామ మందిరంతో పాటు పలు విషయాల గురించి ఆ బాలిక మాట్లాడుతుండటం ప్రధాని మోదీ పక్కనే కూర్చుని వింటున్నారు. ఆ తర్వాత ఆ బాలిక ధరించిన దుపట్టాపై సంతకం చేసి బాలికను అభినందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ బాలికను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకున్నారని ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగానికి చెందిన సుప్రియ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు వినతిపత్రం సమర్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments