Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ వ్యాక్సిన్‌ వికటిస్తే నష్టపరిహారం!

Webdunia
శనివారం, 16 జనవరి 2021 (19:24 IST)
భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్‌కు కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌కు మాత్రమే పరిమిత వినియోగంపై అనుమతులు లభించాయి. కోవిషీల్డ్‌ తీసుకునేవారికి సాధారణంగానే వ్యాక్సిన్‌ వేస్తారు. కానీ, కోవాగ్జిన్‌ తీసుకోవాలంటే మాత్రం అంగీకారపత్రంపై సంతకం పెట్టాల్సి ఉంటుంది.

షరతులు, నిబంధనలు ఈ పత్రంలో ఉంటాయి. ఒకవేళ కోవాగ్జిన్‌ తీసుకున్న తర్వాత సదరు వ్యక్తిలో ఆరోగ్యపరంగా ఏమైనా ప్రతికూల పరిస్థితులు కనిపించినా.. అందుకు ఆ వ్యాక్సినే కారణమని తేలినా.. సదరు వ్యక్తికి వైద్యఖర్చును భరించడమే కాకుండా నష్టపరిహారాన్ని కూడా భారత్‌ బయోటెక్‌ చెల్లిస్తుంది.

ఈ పరిహారాన్ని ఐసిఎంఆర్‌కు చెందిన సెంట్రల్‌ ఎథిక్స్‌ కమిటీ నిర్ణయిస్తుంది. కోవాగ్జిన్‌ తీసుకున్నవారికి ఓ ఫ్యాక్ట్‌ షీట్‌ను, దుష్ఫలితాలను తెలియజేసే ఓ ఫారాన్ని ఇస్తారు.

వ్యాక్సిన్‌ తీసుకున్న నాటి నుండి ఒక వారం పాటు ఆరోగ్యపరంగా ఎదురైన పరిస్థితులను ఈ ఫారంలో రాయాల్సి ఉంటుంది. జ్వరం, నొప్పి, అలర్జీ, మంట వంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడినపుడు ఈ ఫారంలో రాయాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments