Webdunia - Bharat's app for daily news and videos

Install App

సామాజిక సైట్లతో కేంద్ర ప్రభుత్వ శాఖల డీల్స్ ఏంటో ..?: ఢిల్లీ హైకోర్టు

Webdunia
గురువారం, 30 జులై 2015 (19:12 IST)
సామాజిక సైట్లతో కేంద్ర ప్రభుత్వ శాఖల మధ్య ఉన్న ఒప్పందాలను వెల్లడించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్లతో కుదుర్చుకున్న డీల్స్ ఏంటో వాటి వివరాలను తెలియజేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఆయా వెబ్ సైట్లకు ఎలాంటి మేథో హక్కులున్నాయి, వాటి కోసం ఏమైనా లైసెన్స్ కలిగి ఉన్నాయా అని కోర్టు ప్రశ్నించింది. 
 
కేంద్ర శాఖలు ఎలాంటి నిబంధనలు అనుసరించి ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా సైట్లలో ఎకౌంట్ ఓపెన్ చేస్తున్నాయో చెప్పాలని కోరింది. పోస్ట్ చేసే సమాచారంపై మేథో హక్కులు పొందుతున్న సామాజిక మాధ్యమాలు ఎలాంటి రాయల్టీ చెల్లించడం లేదన్న సంగతి గుర్తించారా అని కోర్టు ప్రశ్నించింది. 
 
ఢిల్లీ పోలీస్, ఇండియన్ రైల్వేస్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు సోషల్ మీడియా సైట్లలో ఎకౌంట్లు తెరవడాన్ని తప్పుపడుతూ బీజేపీ నేత కె.ఎన్.గోవిందాచార్య ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దేశంలో సేవలు అందిస్తూ ఆదాయం గడిస్తున్న వెబ్ సైట్ల నుంచి పన్నులు వసూలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
 
ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా ఢిల్లీ హై కోర్టు ఈ సందేహాలు లేవనెత్తింది. ఒప్పంద వివరాలను మరుసటి రోజే బయటపెట్టాలని కోరింది. అయితే కొంత గడువు కావాలని ఎడిషనల్ సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ కోరడంతో తదుపరి విచారణను ఆగస్టు 19కి వాయిదా వేసింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments