తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి జయలలిత ఆర్కే నగర్ (రాధాకృష్ణ నగర్) ఎమ్మెల్యేగా శనివారం పదవీ స్వీకారం చేశారు. అయితే ఈ ప్రమాణ స్వీకర కార్యక్రమం ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా, చాలా సింపుల్గా జరిగింది. ఎసెంబ్లీ స్పీకర్ ధనపాల్ ముఖ్యమంత్రి జయలలిత చేత ఎమ్మెల్యేగా పదవీ స్వీకారం చేయించారు.
కాగా అక్రమాస్తుల కేసులో నిర్దోషిగా తేలిన తర్వాత జయలలిత తమిళనాడు ముఖ్యంగా ప్రమాణస్వీకారం చేసిన విషయం విదితమే. తర్వాత ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో, ముఖ్యమంత్రి జయలలిత 1. 5 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఐదోసారిగా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జయలలిత, ప్రస్తుతం ఆరో సారిగా ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టడం విశేషం.