వాతావరణ మార్పుల అంశం ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాల్ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. వాతావరణ మార్పులపై పోరాడేందుకు భారత్ కట్టుబడి ఉందని మోడీ వ్యాఖ్యానించారు. పారిస్లో జరుగుతున్న వాతావరణ సదస్సు కాప్-21 శిఖరాగ్ర సదస్సులో మోడీ మాట్లాడుతూ.. సాంకేతికతతో పాటు వనరులను పరస్పరం పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఈ సందర్భంగా భారత దేశ సంస్కృతి, అభివృద్ధి గురించిన విషయాలను తెలియజెప్పే భారత్ పెవిలియన్ అనే విండోస్ను మోడీ ఆవిష్కరించారు. మరోవైపు వాతావరణ మార్పులపై సదస్సు నిర్వహించిన తొలితరం మనదేనని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలిపారు. పారిస్లో ప్రారంభమైన సందర్భంగా.. ఒబామా మాట్లాడుతూ, గత ఏడేళ్లుగా ఎన్నో వాతావరణ మార్పులను ఎదుర్కొంటున్నామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులను సమష్టిగా ఎదుర్కోవాలని ఆయన పిలుపు నిచ్చారు.