Webdunia - Bharat's app for daily news and videos

Install App

చోరీకి వచ్చి బాలికపై గ్యాంగ్ రేప్.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 2 నవంబరు 2018 (16:24 IST)
ఇంట్లో చోరీ చేయడానికి వచ్చిన కొందరు దొంగలు.. చివరకు ఆ ఇంట్లో ఉన్న బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. ఒడిషా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో జరిగిన ఈ దాడి వివరాలను పరిశీలిస్తే... 
 
ఒడిషా రాష్ట్రంలోని గంజాం జిల్లా కవి సూర్య నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధి దొయికొన గ్రామంలోని ఓ ఇంట్లోకి ముగ్గురు దుండగులు బుధవారం అర్థరాత్రి దొంగతనం కోసం వచ్చారు. దొరికిన సొమ్మును ఎత్తుకుపోవటంతోపాటు ఇంట్లో అమ్మ పక్కన నిదురిస్తున్న తొమ్మిదేళ్ల బాలికను అపహరించి, సామూహిక అత్యాచారానికి చేశారు. 
 
గురువారం తెల్లవారుజామున మేల్కొన్న బాలిక తల్లి.. కుమార్తె కనిపించకపోవడంతో ఆందోళన చెంది.. భర్తను నిద్ర లేపింది. అప్పటికే ఇంట్లోని సామగ్రి చెల్లాచెదురుగా పడి ఉంది. అల్మారాలో దాచిన రూ.20 వేల నగదు, బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు దంపతులు గుర్తించారు. దొంగతనానికి వచ్చినవారే తమ కుమార్తెనూ ఎత్తుకుపోయి ఉంటారని అనుమానించి, ఇరుగుపొరుగు సాయంతో బాలిక కోసం గాలిస్తుండగా బాధితురాలు ఏడుస్తూ వచ్చింది. 
 
ముగ్గురు ముసుగు దొంగలు తనను ఎత్తుకుని గడ్డివాము చాటుకు తీసుకెళ్తుండగా, మెలకువ వచ్చిందని బాలిక పేర్కొంది. అరిస్తే చంపేస్తామని బెదిరించి దుండగులు అత్యాచారం చేశారని బాధితురాలు బోరున ఏడుస్తూ చెప్పింది. దీంతో బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... ముసుగు దొంగల కోసంగాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం