Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా నిధులతో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ : మంత్రి రవిశంకర్ ప్రసాద్

Webdunia
గురువారం, 25 జూన్ 2020 (19:09 IST)
గాల్వాన్ లోయలో చైనా సైనికుల బరితెగింపు విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబడుతోంది. ముఖ్యంగా, కేంద్రాన్ని ఇరుకున పెట్టేలా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్‌తో పాటు అనేక మంది విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఎదురుదాడికి దిగారు. 
 
చైనా నిధులతోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. రాజీవ్ ట్రస్టుకు చైనా దౌత్య కార్యాలయం నుంచి నిధులు అందుతున్నాయని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ పార్టీ చైనాకు వత్తాసు పలుకుతోందని మండిపడ్డారు. 
 
అంతకుముందు, గాల్వన్ లోయ ఘర్షణల అనంతరం ప్రధాని మోడీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానిస్తూ, చైనా ఎలాంటి దురాక్రమణలకు పాల్పడలేదన్నారు. 
 
ఈ వ్యాఖ్యలపై రాహుల్ మండిపడ్డారు. దురాక్రమణలకు పాల్పడకపోతే ఇంతమంది భారత సైనికులు ఎలా చనిపోయారు? వారు చనిపోయింది ఎవరి భూభాగంలో? అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూటి ప్రశ్నలతో కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. దాంతో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం రాజుకుంది. 
 
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించిన విషయం తెల్సిందే. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి మాట మాట్లాడేటపుడు ఆచితూచి మాట్లాడాలంటూ హితవు పలికారు. 

సంబంధిత వార్తలు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments