Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా వెనక్కి తగ్గింది, భారత్ కమాండర్లతో చర్చలు సఫలం

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (21:40 IST)
భారత సరిహద్దుల్లో చైనా సైనిక బలగాలను మోహరించడం వల్ల నెల రోజుల నుండి చోటుచేసుకుంటున్న ఉద్రిక్తలకు ఇప్పుడు తెరపడింది. ఇరు దేశాలకు చెందిన మిలటరీ కమాండర్ల మధ్య చర్చలు జరిగాక చైనా వెనక్కి తగ్గింది. తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ ప్రాంతం నుంచి సైనిక బలగాలను ఉపసంహరించింది.
 
పాంగ్యాంగ్‌త్సో సెక్టార్‌ నుంచి కూడా చైనా బలగాలు భారీగా వెనక్కు వెళుతున్నాయి. సోమవారం నుండే చైనా సైనిక బలగాల ఉపసంహరణను ప్రారంభించిందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే మూడు ప్రాంతాలలో మోహరింపును ఖాళీ చేయగా, నాలుగో ప్రాంతం నుండి బలగాలు నిష్క్రమిస్తున్నాయి.
 
కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనాలోని సౌత్ జిన్‌జియాంగ్ కమాండర్ మేజర్ జనరల్ లియు లిన్ మధ్య చర్చలు జరగడంతో సమస్య పరిష్కార దిశగా సాగింది. గాల్వాన్ ప్రాంతం, పెట్రోలింగ్ ప్రాంతం 15, హాట్ స్ప్రింగ్స్ ప్రాంతాల్లో ఇరు దేశాల సైన్యం మధ్య ఈ వారం చర్చలు జరిగాయి. బుధవారం మరోసారి మిలటరీ చర్చలు జరగనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments