Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగో తరగతి గొడవ - 62 యేళ్ళ వయసులో కొట్టుకున్నారు...

ఠాగూర్
బుధవారం, 11 జూన్ 2025 (12:48 IST)
కేరళ రాష్ట్రంలోని కాసర్‌కోడ్‌లో ఓ విచిత్ర సంఘటన జరిగింది. రీయూనియన్ పేరుతో 50 యేళ్ల తర్వాత సమావేశమైన స్నేహితులు కొట్టుకున్నారు. నాలుగో తరగతిలో జరిగిన ఓ గొడవను గుర్తుకు తెచ్చుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ బాల్యపు గొడవకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే,
 
కాసర్‌కోడ్‌ జిల్లాలో 50 యేళ్ల తర్వాత రీయూనియన్ పేరుతో ముగ్గురు స్నేహితులు కలుసుకున్నారు. వీరికి ప్రస్తుతం 62 యేళ్ళు. ఈ ముగ్గురు మిత్రుల పేర్లు బాలకృష్ణన్, వీజే బాబు, మాథ్యూ. వీరిలో బాలకృష్ణన్, వీజే బాబులు కాసర‌కోడ్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలో కలిసి చదువుకున్నారు. 
 
నాలుగో తరగతిలో ఉన్నపుడు వీరిద్దరి మధ్య గొడవ జరిగి బాలకృష్ణన్‌ను వీజే బాబు కొట్టారు. ఇది దాదాపు 1970లో జరిగింది. బాలకృష్ణన్ ఇటీవల తన స్నేహితుడైన మాథ్యూతో కలిసి బయటకు వెళ్ళగా, అక్కడ అనుకోకుండా వీజే బాబు కలిశారు. 
 
చిన్ననాడు వీజే బాబు తనను కొట్టాడనే విషయాన్ని మనసులో పెట్టుకున్న బాలకృష్ణన్ మాటల మధ్యలో నాలుగు తరగతి నన్ను ఎందుకు కొట్టావని ప్రశ్నించాడు. మాటా మాటా పెరిగి బాబుబై దాడి చేశాడు. మాథ్యూ కూడా ఓ చేయి వేయడంతో గాయాలపాలైన వీజే బాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విస్తుపోయిన పోలీసులు బాబును కున్నూరు ఆస్పత్రికి తరలించారు. బాలకృష్ణన్, మాథ్యూను పోలీసులు అదుపులోకితీసుకుని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments