Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుషులకూ పిల్లల సంరక్షణ సెలవులు

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (18:32 IST)
పిల్లల సంరక్షణ బాధ్యతలు చూసుకునేందుకు స్త్రీలకే కాదు ఇకపై పురుషుల కూడా సెలవులు లభించనున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. అయితే సింగిల్‌ పెరేంట్స్‌గా ఉన్న పురుష ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఈ సౌలభ్యం వర్తించనుంది.

అలాగే, అవివాహితుడు లేదా భార్య చనిపోయిన లేదా విడాకులు పొందిన మగ ఉద్యోగులకూ ఈ సెలవు ఇది వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీవన సౌలభ్యం కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని జితేంద్ర సింగ్‌ తెలిపారు. ఈ నిర్ణయానికి సంబంధించి కొంత కాలం క్రితమే ఉత్తర్వులు జారీ చేశామని, అయితే ఇంకా దీనిపై సరైన అవగాహన రాలేదని చెప్పారు.

ఇప్పుడు మరింత సడలింపుల్లో భాగంగా.. పిల్లల సంరక్షణలో ఉంటున్న తండ్రి... ముందస్తు అనుమతితో సెలవులు తీసుకోవచ్చునని పేర్కొన్నారు. అదనంగా సెలవు ప్రయాణ రాయితీని (ఎల్‌టిసి) కూడా పొందవచ్చునని తెలిపారు.

పిల్లల సంరక్షణ సెలవులు తొలి 365 రోజులకు గానూ 100 శాతం జీతం చెల్లించనున్నారు. తదుపరి సంవత్సరానికి 80 శాతం జీతం చెల్లించనున్నట్లు జితేంద్ర సింగ్‌ తెలిపారు.

విభిన్న ప్రతిభావంతుల కలిగిన సింగిల్‌ పేరెంట్‌ అయితే.. గతంలో ఉన్న 22 సంరక్షణ బాధ్యతలను తొలగించి.... ఇప్పుడు ఎప్పుడైనా సెలవులు పొందే అవకాశాన్ని కేంద్రం కల్పించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments