Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుషులకూ పిల్లల సంరక్షణ సెలవులు

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (18:32 IST)
పిల్లల సంరక్షణ బాధ్యతలు చూసుకునేందుకు స్త్రీలకే కాదు ఇకపై పురుషుల కూడా సెలవులు లభించనున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. అయితే సింగిల్‌ పెరేంట్స్‌గా ఉన్న పురుష ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఈ సౌలభ్యం వర్తించనుంది.

అలాగే, అవివాహితుడు లేదా భార్య చనిపోయిన లేదా విడాకులు పొందిన మగ ఉద్యోగులకూ ఈ సెలవు ఇది వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీవన సౌలభ్యం కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని జితేంద్ర సింగ్‌ తెలిపారు. ఈ నిర్ణయానికి సంబంధించి కొంత కాలం క్రితమే ఉత్తర్వులు జారీ చేశామని, అయితే ఇంకా దీనిపై సరైన అవగాహన రాలేదని చెప్పారు.

ఇప్పుడు మరింత సడలింపుల్లో భాగంగా.. పిల్లల సంరక్షణలో ఉంటున్న తండ్రి... ముందస్తు అనుమతితో సెలవులు తీసుకోవచ్చునని పేర్కొన్నారు. అదనంగా సెలవు ప్రయాణ రాయితీని (ఎల్‌టిసి) కూడా పొందవచ్చునని తెలిపారు.

పిల్లల సంరక్షణ సెలవులు తొలి 365 రోజులకు గానూ 100 శాతం జీతం చెల్లించనున్నారు. తదుపరి సంవత్సరానికి 80 శాతం జీతం చెల్లించనున్నట్లు జితేంద్ర సింగ్‌ తెలిపారు.

విభిన్న ప్రతిభావంతుల కలిగిన సింగిల్‌ పేరెంట్‌ అయితే.. గతంలో ఉన్న 22 సంరక్షణ బాధ్యతలను తొలగించి.... ఇప్పుడు ఎప్పుడైనా సెలవులు పొందే అవకాశాన్ని కేంద్రం కల్పించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments