Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో ఒంటరిగా ఉంది.. వివాహితపై అత్యాచారయత్నం.. ప్రతిఘటించిందని సజీవదహనం..

దేశంలో మహిళలపై దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. బాలికల నుంచి ముదుసలి వరకు వావి వరసలు లేకుండా అత్యాచారాలను పాల్పడుతున్న కామాంధుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా సాక్షాత్తు భర్త బంధువు చేసిన అత్యాచార యత్నాన

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2017 (09:40 IST)
దేశంలో మహిళలపై దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. బాలికల నుంచి ముదుసలి వరకు వావి వరసలు లేకుండా అత్యాచారాలను పాల్పడుతున్న కామాంధుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా సాక్షాత్తు భర్త బంధువు చేసిన అత్యాచార యత్నాన్ని ప్రతిఘటించిందనే కోపంతో ఓ మహిళను సజీవదహనం చేసిన ఘటన ఛత్తీస్‌ఘడ్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని కోర్బా జిల్లా, ఉర్గా పోలీసుస్టేషను పరిధిలోని మడ్వారనీ గ్రామానికి చెందిన 30 ఏళ్ల వివాహిత ఇంట్లో ఒంటరిగా ఉండగా.. భర్త బంధువు రమేష్ పటేల్ ఇంటికొచ్చాడు. అంతటితో ఆగకుండా ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారానికి యత్నించాడు. 
 
అయితే ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. అంతే కోపంతో ఊగిపోయిన ఆ కామాంధుడు.. వివాహిత ఒంటిపై కిరోసిన్ నిప్పంటించి సజీవ దహనం చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధిత మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. పరారీలో ఉన్న రమేష్ పటేల్ కోసం గాలిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అజిత్ కుమార్ పట్టుదలకు యు/ఎ సెన్సార్

అప్సరా రాణి రాచరికం మూవీ ఎలా ఉందంటే.. రాచరికం రివ్యూ

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments