Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛత్తీస్‌గఢ్‌లో రెచ్చిపోయిన మావోలు.. ఎన్.ఎం.డి.సిపై దాడి.. భారీగా ఆస్తి నష్టం

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2015 (09:16 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఈ రాష్ట్రంలో ఉన్న నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్.ఎం.డి.సి)పై దాడి చేసి భారీగా ఆస్తి నష్టం కలిగించారు. ఆదివారం అర్థరాత్రి ఉన్నట్టుండి ఒక్కసారిగా మావోలు ఈ దాడికి తెగబడ్డారు. బచేలి పోలీసుస్టేషను పరిధిలో ఎన్‌ఎండీసీ ఉంది. ఈ ప్లాంట్‌పై దాడి చేసిన మావోలు... మూడు షావెల్స్‌, డ్రిల్‌ మిషన్‌, మోటారు పంపులను దహనం చేశారు. ఈ సంఘటనలో వంద కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. 
 
దీంతో అప్రమత్తమైన సీఐఎస్‌ఎఫ్‌ జవాన్లు కాల్పులు జరిపారు. దీంతో మావోయిస్టులు కూడా ఎదురుకాల్పులు జరపడంతో ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. ఇక్కడ పరిస్థితి భయానకరంగా ఉంది. ఈ కాల్పుల కారణంగా ఎన్.ఎం.డి.సిలో ఉత్పత్తిని నిలిపివేశారు. ప్రస్తుతం సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ కాల్పుల్లో ప్రాణనష్టమేదీ సంభవించలేదు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments