Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాంత్రికుడి మాటలు నమ్మి బతికున్న కోడిపిల్లను మింగేశాడు..

ఠాగూర్
మంగళవారం, 17 డిశెంబరు 2024 (09:56 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి తాంత్రికుడి మాటలు నమ్మి బతికున్న కోడిపిల్లను అమాంతం మింగేశాడు. పిల్లలులేని ఓ వ్యక్తి మూఢనమ్మకంతో బతికున్న కోడిపిల్లను మింగడంతో అది కాస్త గొంతులో ఇరుక్కుని పోయింది. దీంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. అయితే, అతడు చనిపోయినా ఆ కోడిపిల్ల బతికే ఉండటం గమనార్హం.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూరికి చెందిన ఆనంద్ యాదవ్‌కు వివాహమై చాలా ఏళ్లు అయినా సంతానం లేదు. దాంతో పిల్లలు పుట్టే మార్గం చూపమని ఓ తాంత్రికుడిని సంప్రదించాడు.
 
అతడి సూచన మేరకు బతికున్న కోడిపిల్లను అమాంతం మింగేశాడు. అది అతడి గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక కుప్పకూలాడు. దాంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆనందన్‌ను అంబికాపూర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు చనిపోయినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టంలో అతడి గొంతులో కోడిపిల్లను వైద్యులు గుర్తించారు.
 
ఆనంద్ చనిపోయినా ఆ కోడిపిల్ల బతికే ఉండటం వైద్యులకు షాకిచ్చింది. 20 సెంటీమీటర్ల కోడిపిల్ల గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక ఆనంద్ యాదవ్ చనిపోయినట్లు వైద్యుడు సంతు బాగ్ వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments