Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో మహిళా ఇన్‌స్పెక్టర్ భర్త సూసైడ్.. ఎందుకంటే...

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (13:25 IST)
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ఓ మహిళా ఇన్‌స్పెక్టర్ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి భార్య వేధింపులే కారణమని ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చెన్నై అన్నానగర్‌లో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చెన్నై నగర పోలీసు విభాగంలో సుచిత్రా దేవి (40) అనే మహిళ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తోంది. ఈమె అన్నా నగర్‌లోని పోలీస్ క్వార్టర్స్‌లో పని చేస్తోంది. అయితే, ఈమెకు మొదటి భర్త అనారోగ్యం కారణంగా 2009లో చనిపోయాడు. మొదటి భర్త ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఈ క్రమంలో 2012లో గోపీనాథఅ (35) అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి లక్షణ (03) అనే కుమార్తె ఉంది. 
 
ఈ నేపథ్యంలో సోమవారం భార్య సుచిత్రాదేవితో భర్త తన మొబైల్ ఫోనులో మాట్లాడారు. వారిద్దరి మధ్య ఫోనులో ఎలాంటి సంభాషణలు జరిగాయో తెలియదు కానీ, ఇంటికి వచ్చిన గోపీనాథ్‌ పడక గదికి నిద్రించేందుకు వెళ్లాడు. సుచిత్రాదేవి తలుపులు తట్టగా తెరచుకోలేదు. 
 
తలుపులు పగులగొట్టి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న అన్నానగర్‌ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం కీల్పాక్కం ఆసుపత్రికి పంపారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి మహిళా ఇన్‌స్పెక్టర్‌ సుచిత్రాదేవి వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments