Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిలో దోశె పిండి కొనుగోలు చేస్తే ఒక బిందె నీరు ఉచితం!

Webdunia
సోమవారం, 1 జులై 2019 (11:13 IST)
చెన్నై మహానగరంలో తీవ్రమైన నీటీ ఎద్దడి నెలకొంది. తాగేందుకు కూడా బిందెడు నీటి కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం రేయింబవుళ్లు శ్రమిస్తోంది. ఇందుకోసం పొరుగు జిల్లాల నుంచి కూడా నీటిని తరలించే చర్యలను చేపట్టనుంది. 
 
ఈ క్రమంలో చెన్నై నగరానికి చెందిన ఓ వ్యాపారికి వినూత్న ఆలోచన ఒకటి వచ్చింది. తన దుకాణంలో కిలో దోశె పిండి కొనుగోలు చేస్తే ఒక బిందెనీరు ఉచితం అంటూ ఓ ప్రకటన బోర్డును ఏర్పాటు చేశాడు. తద్వారా నీటి సమస్యతో బాధపడేవారికి నీటిని ఇవ్వడంతో పాటు... తన వ్యాపారాన్ని కూడా రెట్టింపు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని భావించాడు. ఈ ఫ్లెక్సీ ఇపుడు ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తోంది.
 
ఈ ప్రకటన బోర్డుతో ఇప్పుడతని దుకాణం కస్టమర్లతో కిటకిటలాడుతోంది. తాను 24 సంవత్సరాలుగా ఈ దుకాణం సాగుతున్నానని, నీరు ఉచితమన్న తరువాత అమ్మకాలు బాగా పెరిగాయని దుకాణం యజమాని అంటున్నారు. ఈ ఒక్క సంఘటనే చెన్నై నగరంలో నెలకొన్న నీటి ఎద్దడి తీవ్రతను కళ్లకు కడుతోంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments