Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిలో దోశె పిండి కొనుగోలు చేస్తే ఒక బిందె నీరు ఉచితం!

Webdunia
సోమవారం, 1 జులై 2019 (11:13 IST)
చెన్నై మహానగరంలో తీవ్రమైన నీటీ ఎద్దడి నెలకొంది. తాగేందుకు కూడా బిందెడు నీటి కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం రేయింబవుళ్లు శ్రమిస్తోంది. ఇందుకోసం పొరుగు జిల్లాల నుంచి కూడా నీటిని తరలించే చర్యలను చేపట్టనుంది. 
 
ఈ క్రమంలో చెన్నై నగరానికి చెందిన ఓ వ్యాపారికి వినూత్న ఆలోచన ఒకటి వచ్చింది. తన దుకాణంలో కిలో దోశె పిండి కొనుగోలు చేస్తే ఒక బిందెనీరు ఉచితం అంటూ ఓ ప్రకటన బోర్డును ఏర్పాటు చేశాడు. తద్వారా నీటి సమస్యతో బాధపడేవారికి నీటిని ఇవ్వడంతో పాటు... తన వ్యాపారాన్ని కూడా రెట్టింపు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని భావించాడు. ఈ ఫ్లెక్సీ ఇపుడు ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తోంది.
 
ఈ ప్రకటన బోర్డుతో ఇప్పుడతని దుకాణం కస్టమర్లతో కిటకిటలాడుతోంది. తాను 24 సంవత్సరాలుగా ఈ దుకాణం సాగుతున్నానని, నీరు ఉచితమన్న తరువాత అమ్మకాలు బాగా పెరిగాయని దుకాణం యజమాని అంటున్నారు. ఈ ఒక్క సంఘటనే చెన్నై నగరంలో నెలకొన్న నీటి ఎద్దడి తీవ్రతను కళ్లకు కడుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments