Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అమ్మ’ క్యాంటీన్లలో ధరల పెంపు... మౌనందాల్చిన ఓపీఎస్

నిరుపేదల కడుపు నింపేందుకు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఏర్పాటు చేసిన ‘అమ్మ క్యాంటీన్ల'లో విక్రయించే ఆహార పదార్థాల ధరలను పెంచనున్నారు. ఈ క్యాంటీన్లలో అందించే ఆహార పదార్థాల ధరల వల్ల విపరీతమైన నష్టాలు వస్తు

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (11:01 IST)
నిరుపేదల కడుపు నింపేందుకు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఏర్పాటు చేసిన ‘అమ్మ క్యాంటీన్ల'లో విక్రయించే ఆహార పదార్థాల ధరలను పెంచనున్నారు. ఈ క్యాంటీన్లలో అందించే ఆహార పదార్థాల ధరల వల్ల విపరీతమైన నష్టాలు వస్తున్నాయి. ఈ నష్టాలను ఓ సాకుగా చూపి క్యాంటీన్లలో విక్రయించే ఆహార పదార్థాల ధరలను పెంచాలని నిర్ణయించింది. అంతేగాక ప్రస్తుతం అందిస్తున్న ఆహార పదార్థాలతో పాటు కాయగూరలు, నిత్యావసర వస్తువులను కూడా విక్రయిచాలని కార్పొరేషన్‌ భావిస్తోంది.
 
చెన్నై మహానగరంలో 2013లో అమ్మా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. ప్రజల నుంచి మంచి ఆదరణ లభించడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపజేశారు. జీసీఎంసీ పరిధిలో 407 అమ్మా క్యాంటీన్ల ద్వారా ప్రతిరోజూ కేవలం రూ.20లు చెల్లించి మూడు పూటలా కడుపునిండా ఆహారం తీసుకోవచ్చు. ఉదయం రూ.1కి ఒక ఇడ్లీ, రూ.3కు పొంగల్‌, మధ్యాహ్నం రూ.5కు సాంబారన్నం పులిహోర, రూ.3కు పెరుగన్నం, సాయంత్రం రూ.10కి మూడు చపాతీలను అందిస్తున్నారు.
 
పలు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులే కాకుండా విదేశీయులు కూడా ఈ పథకాన్ని స్వయంగా పరిశీలించి, అభినందించారు. ఇంతటి ఆదరణ పొందిన ఈ పథకం జయ మరణానంతరం సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కుంటుపడుతోంది. ఈ క్యాంటీన్లలో అందించే ఆహారం రుచికరంగా ఉండటం లేదని, నాణ్యత లోపించిందన్న ఆరోపణలు కూడా తీవ్రమయ్యాయి.
 
ఈ నేపథ్యంలో నష్టాన్ని చవిచూస్తున్న క్యాంటీన్ల ఆదాయం పెంచేందుకు అధికారులు తమ బుర్రలకు పదును పెట్టారు. ఇక నుంచి ఇడ్లీ రూ.3, పొంగల్‌ రూ.7, పెరుగన్నం రూ.5, సాంబారన్నం రూ.7 విక్రయించాలని భావిస్తున్నారు. ఆ మేరకు నివేదికలు కూడా రూపొందించారు. ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాగానే వీటిని అమలు చేయాలని అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments