Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైపై పంజా విసిరిన వార్దా తుఫాను.. 140కి.మీ వేగంతో గాలులు.. నలుగురి మృతి.. చీకటిలో చెన్నై...

చెన్నైపై వార్దా తుఫాను పంజా విసిరింది. 140 కిలోమీటర్ల వేగంతో సోమవారం ఉదయం చెన్నై సమీపంలో తమిళనాడు సముద్రతీరాన్ని తాకింది. కొద్ది గంటల పాటు చెన్నై తల్లడిల్లిపోయింది. తుఫాను తీవ్రతకు నలుగురు చనిపోయినట్ల

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2016 (09:00 IST)
చెన్నైపై వార్దా తుఫాను పంజా విసిరింది. 140 కిలోమీటర్ల వేగంతో సోమవారం ఉదయం చెన్నై సమీపంలో తమిళనాడు సముద్రతీరాన్ని తాకింది. కొద్ది గంటల పాటు చెన్నై తల్లడిల్లిపోయింది. తుఫాను తీవ్రతకు నలుగురు చనిపోయినట్లు తెలుస్తోంది. భారీ గాలుల ఉధృతికి పెద్ద సంఖ్యలో చెట్లు నేలకూలాయి. విద్యుత్‌ స్తంభాలు విరిగి పడిపోయాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. 
 
ఒకవైపు భారీ వర్షం... మరోవైపు రాకాసి గాలుల ప్రభావంతో ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ గ్లాస్‌ ప్యానెల్స్‌ ఊడిపోయాయి. రహదారులపై వర్షపు నీరు నిల్చుని రాకపోకలకు అంతరాయం కలిగింది. సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకు ఈ ఉధృతి కొనసాగింది. చెన్నై విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసేశారు. వివిధ ప్రాంతాల నుంచి చెన్నైకి వచ్చే రైళ్లలో కొన్నింటిని దారి మళ్లించారు.
 
దాదాపు 17 రైళ్లను రద్దు చేశారు. చెన్నై నగరంలోని సబర్బన్‌ రైళ్లను మొత్తానికి రద్దు చేశారు. చెన్నైతోపాటు కాంచీపురం, తిరువళ్లూరు లోని అన్ని విద్యాసంస్థలకు మంగళవారం సెలవు ప్రకటించారు. తుఫాన్‌ తాకిడి కారణంగా 47 గుడిసెలు, 3384 చెట్లు, 3400 విద్యుత్‌ స్తంభాలకు నష్టం జరిగినట్లు జాతీయ విపత్తు నివారణ సంస్థ వెల్లడించింది.
 
వరద పరిస్థితిపై సీఎం పన్నీరు సెల్వం ఎప్పటికప్పుడు సమీక్షించారు. కేంద్ర హోంశాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సీఎం సెల్వంకు ఫోన్‌ చేశారు. అవసరమైన సహాయాన్నంతా అందిస్తామని భరోసా ఇచ్చారు. వరద సహాయక చర్యల కోసం నావికా, వైమానిక దళాలు ఆహారం, నీరు, డాక్టర్స్‌ తో రెడీగా ఉన్నాయి.
 
వార్ధా తీరం దాటకముందే ముందస్తు చర్యల్లో భాగంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌‌లో 16 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వార్ధా ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై తక్కువగానే ఉంది. నెల్లూరు, చిత్తూరు జిల్ల్లాల్లో మాత్రమే తుఫాన్‌ ప్రభావం కనిపించింది. గాలి ఉధృతికి సుళ్లూరుపేట వద్ద ఓ ఆయిల్‌ ట్యాంకర్‌ తిరగబడిపోయింది.
 
రేణిగుంట విమానాశ్రయంలో పైకప్పు రేకులు కదిలాయి. గూడురు, చెన్న్తె మధ్య రైల్వే ట్రాక్‌ దెబ్బతినడంతో రైళ్లను రద్దు చేశారు. ఇక మంగళవారం నాడు తుఫాన్‌ కర్నాటక మీదుగా గోవాకు దక్షిణంగా తరలిపోతుందని అధికారులు వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments