Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏసీ ఆన్ చేసి కారులోనే విశ్రాంతి.. నవ వధువుతో పాటు తల్లిదండ్రులు నిప్పుకు బలి.. ఎలా?

తమిళనాడులోని మహాబలిపురం సమీపంలోని ఈసీఆర్ రోడ్డులో ఘోరం జరిగింది. రోడ్డు పక్కనే నిల్చున్న కారు నిప్పుకు ఆహుతి అయ్యింది. ఈ నిప్పులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవదహనం అయ్యారు. వీరిలో నవ వధువు కూడా

Webdunia
సోమవారం, 29 మే 2017 (13:25 IST)
తమిళనాడులోని మహాబలిపురం సమీపంలోని ఈసీఆర్ రోడ్డులో ఘోరం జరిగింది. రోడ్డు పక్కనే నిల్చున్న కారు నిప్పుకు ఆహుతి అయ్యింది. ఈ నిప్పులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవదహనం అయ్యారు. వీరిలో నవ వధువు కూడా ఉండటం అనుమానాలకు తావిస్తోంది. 
 
వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని చిట్లపాక్కంకు చెందిన ఆడిటర్ జయదేవన్ (45), ఆయన భార్య రమాదేవి, వీరి కుమార్తె దివ్యశ్రీలు సజీవదహనం అయ్యారని పోలీసులు వెల్లడించారు. జయదేవన్ సతీమణి రమాదేవి టీచర్‌గా పని చేస్తుండగా, దివ్యశ్రీకి ఇటీవలే వివాహం జరిగింది. దివ్యశ్రీ భర్త విదేశాలకు వెళ్లడంతో ఆమె తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. మహాబలిపురం సమీపంలోని ఓ స్థలం చూసేందుకు జయదేవన్ తన భార్య రమాదేవి, కుమార్తె దివ్యశ్రీతో కలిసి వెళ్లారు.
 
ఎండలు మండిపోతుండటంతో స్థలం చూసిన తర్వాత ముగ్గురు కారులోనే విశ్రాంతి తీసుకుంటున్నారని.. ఆ సమయంలో మంటలు వ్యాపించినట్లు పోలీసులు చెప్పారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నెంబర్ ప్లేట్ ఆధారంగా మృతులను గుర్తించారు. 
 
ఏసీ మిషన్ పేలి మంటలు వ్యాపించడంతోనే జయదేవన్ ఫ్యామిలీ నిప్పుకు ఆహుతి అయినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే నవ వధువు మృతి చెందడం.. నిద్రిస్తున్న కారులో మంటలు వ్యాపించడం వెనుక వేరేదైనా కారణాలున్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments