Webdunia - Bharat's app for daily news and videos

Install App

45 రోజులు సహజీవనం చేశాడు.. రైలులో వదిలిపెట్టి వెళ్లిపోయాడు!

Webdunia
సోమవారం, 28 జులై 2014 (14:59 IST)
పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. 45 రోజుల పాటు హ్యాపీగా గడిపాడు. అంతే మళ్లీ జెండా ఎత్తేశాడు. కేరళ ఉడిపి జిల్లాలో ఒసాకోట్టై గ్రామానికి చెందిన అన్నప్ప పూజారి కుమారుడు రాజేంద్ర కూడా పూజారి (25) కేటరింగ్ పూర్తిచేసి ముంబైలోని ఓ స్టార్ హోటల్‌లో పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో రాజేంద్ర రెండేళ్ల క్రితం సెలవులంటూ సొంత గ్రామానికి వచ్చాడు. ఆ గ్రామంలోని సీత (20) అనే అమ్మాయిని మాయమాటలతో ప్రేమలో పడేశాడు.
 
సెల్‌ఫోన్ పరిచయం ద్వారా వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. ఇదే అదనుగా తీసుకున్న రాజేంద్ర.. కొన్ని నెలల క్రితం సీతను ముంబై రావాల్సిందిగా చెప్పాడు. పెళ్లి చేసుకుంటానన్నాడు. దీన్ని నమ్మిన సీత ఐదు సవర్ల నగలు, రూ.30వేల నగదు ఇంటి నుంచి వచ్చేసింది. ముంబైలో వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. 
 
45 రోజుల పాటు సహజీవనం చేశారు. ఈ నేపథ్యంలో సీత తనను వివాహం చేసుకోవాల్సిందిగా బలవంతపెట్టింది. అంతే మంగళూరులో వివాహం చేసుకుందామంటూ వెంటబెట్టుకుని వచ్చిన రాజేంద్ర రైలులోనే ఆమెను వదిలిపెట్టి జంప్ అయ్యాడు. ఈ విషయాన్ని మంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో సీత తన సొంతూరులోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments