Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చన్నీ

Webdunia
ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (17:47 IST)
పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చరణ్జీత్ సింగ చన్నీ పేరును ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఆదివారం లుథియానాలో జరిగిన ఓ వర్చువల్ ర్యాలీలో రాహుల్ ప్రకటన చేశారు. తద్వారా గత కొన్ని రోజులుగా సాగుతున్న చర్చకు ఆయన తెరదించారు. అంతేకాకుండా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన పేరును ప్రకటిస్తారని ఆశిస్తూ వచ్చిన పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ ఆశలపై రాహుల్ గాంధీ నీళ్లు చల్లారు. 
 
పంజాబ్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో అత్యధికుల అభిప్రాయం మేరకే ప్రస్తుత ముఖ్యమంత్రి చన్నీ పేరును మళ్లీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసి అధికారికంగా ప్రకటించినట్టు ఆయన పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం పంజాబ్‌లో 32 శాతం మేరకు దళిత వర్గానికి చెంది సిక్కుల ఓట్లు ఉన్నాయి. ఇది కూడా చన్నీని సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి ఓ కారణంగా చెప్పొచ్చు. 
 
కాగా, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్‌కు పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్న అమరీందర్ సింగ్‌కు మధ్య ఏర్పడిన వివాదాల కారణంగా సీఎం పదవికి అమరీందర్ రాజీనామా చేశారు. ఆ తర్వాత పార్టీ నుంచి తప్పుకున్నారు. పిమ్మట ఆయన బీజేపీలో చేరనున్నారనే వార్తలు హల్చల్ చేశాయి. కానీ, ఆయన బీజేపీతో చేతులు కలపకుండా ఒంటరిగానే ప్రయాణిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments